* ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీజేపీ నేతలు హౌస్ అరెస్ట్

* ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తాం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీజేపీ నేతలు హౌస్ అరెస్ట్*
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు మొగుళ్లపల్లి మండలానికి చెందిన బీజేపీ నాయకులను అర్ధరాత్రి సమయంలో హౌస్ అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ మోరె రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం అక్రమంగా నిర్బంధాలు చేస్తున్నప్పటికీ తాము భయపడబోమని స్పష్టం చేశారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. రైతు భరోసా, మహిళలకు తులం బంగారం, యువతకు ఉపాధి అవకాశాలు వంటి హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మండల అధ్యక్షుడు మోరె వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ
ప్రజా సమస్యలను పట్టించుకోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం కొనసాగుతుందని, ప్రతి కార్యకర్త బాధ్యతగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చెవ్వశేషగిరి కుమ్మరి సారయ్య బండారి రవీందర్ మండల ప్రధాన కార్యదర్శిలు బండారి శ్రీనివాస్ అరికాంతపు కృష్ణారెడ్డి మండల ఉపాధ్యక్షులు రాస బిక్షపతి తదితరులు పాల్గొన్నారు

పరకాలలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు…

పరకాలలో బీజేపీ నాయకుల ముందస్తు అరెస్టు

పరకాల,నేటిధాత్రి

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు పిలుపునిచ్చిన నేపథ్యంలో పరకాలలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఈ క్రమంలో సోమవారం ఉదయం పరకాల పట్టణంలో పోలీసులు ముందస్తు చర్యగా బీజేపీ నాయకులను అరెస్టు చేశారు.రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాచం గురుప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి మేఘనాథ్,9వ వార్డ్ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణచారి,పట్టణ ప్రధాన కార్యదర్శి పాలకుర్తి తిరుపతి, జిల్లా నాయకుడు బాసాని సోమరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version