నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి..

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి

◆”-: మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ డా౹౹ఏ.చంద్రశేఖర్ గారి ఆదేశాలతో

◆”-: లబ్దిదారులకు ₹ 18,35,500 /- సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత

జహీరాబాద్ నేటి ధాత్రి:

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిది అని, నిరుపేదలు అనారోగ్యానికి గురై తన సొంత ఖర్చులతో ఆసుపత్రిలో చికిత్స చేసుకున్న అనంతరం ఖర్చు అయిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేస్తుందని మాజీ మంత్రి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ డా:చంద్రశేఖర్ తెలిపారు.నియోజకవర్గంలోని జహీరాబాద్,న్యాలకల్, కోహిర్, ఝారసంఘం, మొగుడంపల్లి,మండలాల లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇంచార్జ్ డా చంద్రశేఖర్ సూచన మేరకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి, మండల అద్యక్షులు హన్మంతరావు పాటిల్, శ్రీనివాస్ రెడ్డి,సర్పంచులు వీరా రెడ్డి, రాజ్ కుమార్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి ,సత్వర్ పిఎసిఎస్ ఛైర్మెన్ చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇప్పేపల్లి మాజీ పిఎసిఎస్ ఛైర్మెన్ వెంకట్ రెడ్డి , కాంగ్రెస్ నాయకులు హుగ్గేల్లి రాములు,శేఖర్ ,విష్ణు , ఫైజ్, తదితరులు అందజేశారు..సిఎంఆర్ఎఫ్ చెక్కులను అందుకున్న లబ్ధిదారులు మాజీ మంత్రి డా:చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం : తోటకూర వజ్రెష్ యాదవ్…

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం : తోటకూర వజ్రెష్ యాదవ్

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి 5 :

 

ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమని మేడ్చల్ – మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ అన్నారు.
ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని వివిధ సర్కిల్‌ల పరిధిలోని లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను ఆయన నివాసంలో అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజంగా అర్హులైన పేదలకు చేరాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అనారోగ్యం, ప్రమాదాలు, ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న పేద కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఎంతో ఊరటనిస్తోందని పేర్కొన్నారు. బోడుప్పల్ జిహెచ్ఎంసి సర్కిల్ రామ్ లాల్ నాయక్ కు రూ. 33000, నాగారంకు చెందిన హేమంత్ కు రూ. 60.000, ఘట్కేసర్ సూర్య దేవి రూ. 55,000, పూస నరేందర్ రూ. 33,500, మహమ్మద్ ఖాన్ రూ. 60,000, పాపుల నరసింహ రూ. 38,500, బోడుప్పల్ సర్కిల్ దేవేందర్ నగర్ సమ్మక్క రూ. 60,000, పీరజాదిగూడ
రోహిత్ రూ. 60,000, రాగిరే విజయ్ కుమార్ రూ. 60,000, బోడుప్పల్ సోమనారాయణ రూ. 32,000, శామీర్ పేట్ కన్నబోయిన వసంత రూ. 35,000, మంజుల రూ. 31,500, మూడు చింతలపల్లి సింఘం సక్కుబాయి రూ. 60,000, ఆరోని రూ. 60,000 చెక్కులు అందజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version