పాడైపోయిన బోరు మోటర్ పున ప్రారంభం….

పాడైపోయిన బోరు మోటర్ పున ప్రారంభం….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీ గ్రామంలో గత కొన్ని నెలలుగా బోరు మోటర్ పనిచేయకపోవడంతో. గ్రామంలోని ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు గురవుతుండగా స్థానిక సర్పంచ్ గడ్డం రచన మధుకర్. ఆధ్వర్యంలో ఇంద్రమ్మ కాలనీ గ్రామంలోని పోచమ్మ ఆలయం వద్ద 15 నెలలుగా పాడైపోయిన బోరు మోటర్ ను పున ప్రారంభించి గ్రామ ప్రజలకు నీటి సౌకర్యం కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. కొన్ని రోజులుగా గ్రామంలో నీటి బోరు పనిచేయకపోవడంతో గ్రామంలోని ప్రజలు నీ రు లేక ఇబ్బందులు గురవుతుండగా. సంబంధిత అధికారులతో మాట్లాడి నీటి కష్టాలు లేకుండా ప్రజలకు మళ్లీ బోరు బాగు చేయించి ప్రజలకు నీటి కష్టాలు తొలగించే విధంగా బోరును పున ప్రారంభించామని ఈ సందర్భంగా తెలియజేశారుఇట్టి కార్యక్రమంలో. ఉపసర్పంచ్ కొండ శ్రీకాంత్. వార్డు సభ్యులు వడ్డేపల్లి రమ. ముందాటి శారద. నాయకులు రచ్చ మల్ల సుదర్శన్. గాలి వీరేశం. అలువాలప్రశాంత్.దిండిగాల లక్ష్మి.నాగిళ్ల.సత్యవతి.రాచర్ల వాణి. పుష్పలత గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

హనుమాన్ స్వాములకు సర్పంచి ఎండి మొయిజ్ బిక్ష…

హనుమాన్ స్వాములకు సర్పంచి ఎండి మొయిజ్ బిక్ష

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో మతసామరస్యం వెల్లివిరిసింది. హనుమాన్ మాలధారణ చేసిన స్వాములకు రామడుగు గ్రామ సర్పంచ్ ఎండి మొయిజ్ సద్దాం ప్రత్యేకంగా భిక్ష (అన్నదానం) ఏర్పాటు చేశారు. భక్తి, మానవత్వం మతాల కంటే గొప్పవని ఆయన చాటిచెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తాయని, అందరూ ఐక్యంగా ఉండాలని స్వాములు ఈసందర్భంగా పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో హనుమాన్ భక్తబృందం, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

గ్రామంలో మిషన్ భగీరథ నీటి కొరకు ముందడుగు వేసిన సర్పంచ్..

గ్రామంలో మిషన్ భగీరథ నీటి కొరకు ముందడుగు వేసిన సర్పంచ్

మల్లాపూర్ నేటి ధాత్రి

 

గుండంపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీరు గ్రామంలో ఏ ఒక్క ఇంటికి రావడం లేదు అని సర్పంచ్ దప్పుల పద్మ నరసయ్య ఎంపీడీవో కి సోమవారం విన్నవించగా మంగళవారం మిషన్ భగీరథ గ్రిడ్ ఎఇ జ్ఞానేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఎఇ మహేష్ గ్రామానికి విచ్చేసి నీరు రాకపోవడానికి గల సమస్యలను తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పుష్పలత నరసయ్య,ఉప సర్పంచ్ గంగాధర్, సిరికొండ గంగారెడ్డి, మురళి, ముత్యాలు, రెబల్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version