గ్రామంలో మిషన్ భగీరథ నీటి కొరకు ముందడుగు వేసిన సర్పంచ్
మల్లాపూర్ నేటి ధాత్రి
గుండంపల్లి గ్రామంలో మిషన్ భగీరథ నీరు గ్రామంలో ఏ ఒక్క ఇంటికి రావడం లేదు అని సర్పంచ్ దప్పుల పద్మ నరసయ్య ఎంపీడీవో కి సోమవారం విన్నవించగా మంగళవారం మిషన్ భగీరథ గ్రిడ్ ఎఇ జ్ఞానేశ్వర్, ఆర్డబ్ల్యూఎస్ ఎఇ మహేష్ గ్రామానికి విచ్చేసి నీరు రాకపోవడానికి గల సమస్యలను తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యను పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నారాయణరెడ్డి, ఏఎంసీ చైర్మన్ పుష్పలత నరసయ్య,ఉప సర్పంచ్ గంగాధర్, సిరికొండ గంగారెడ్డి, మురళి, ముత్యాలు, రెబల్ తదితరులు పాల్గొన్నారు.
