ఎన్నికల చెక్పోస్ట్‌ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ

గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన చెక్పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం. జిల్లెల్ల గ్రామంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టునుఆకస్మికంగా తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ. ఈ సందర్భంగా ఎస్పీ తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏర్పాటుచేసిన పోలీసు చెక్పోస్ట్ ను తనిఖీ చేస్తూ పలు వాహనాలను ఆపి తనిఖీ చేయాలని తదుపరి వాహనాలు సంబంధించిన రిజిస్ట్రేషన్ పరిశీలించడంతోపాటు ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలను చేస్తున్న తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పలు సూచనలు చేస్తూ తనిఖీ సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని. వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్రమంగా నగదు మద్యం రవాణానచేస్తున్నట్టు దృష్టికి వస్తే చట్టపరమైన చర్యలతో పాటు.వాటినిఅరికట్టాలనీ సూచిస్తూ ఓటర్లను ప్రభావితం పెట్టడానికి డబ్బులు మద్యం ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే పోలీస్ స్టేషన్కుసిబ్బందివారికి సమాచారం అందించాలని సూచిస్తూ శాంతి భద్రతలకు విఘాతంకలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడితే వారిపై ఎన్నికల నియమా వలిప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు కేసులు నమోదు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏదైనా అనుమానం కలిగినచో వెంటనే సమాచారం అందించాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి తనిఖీల కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే. రూలర్ సిఐ మొగిలి పోలీస్ సిబ్బంది చెక్పోస్ట్ సిబ్బంది తదితరులు ఉన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version