కార్మిక హక్కులపై ‘కోడ్’ దెబ్బ: శేరిలింగంపల్లి లో మిన్నంటిన నిరసన..

కార్మిక హక్కులపై ‘కోడ్’ దెబ్బ: శేరిలింగంపల్లి లో మిన్నంటిన నిరసన

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

 

దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ సర్కిల్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కార్మిక సంఘాలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నినదించారు.
​ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ,ఏఐసీటీయూ,నాయకులు కొంగర కృష్ణ, చందు యాదవ్, సంజీవరెడ్డి, దానయ్య మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని తుంగలో తొక్కి, 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చడం దుర్మార్గమని నాయకులు మండిపడ్డారు. ఈ కొత్త చట్టాల వల్ల:
​సమాన పనికి సమాన వేతనం అందే అవకాశం లేకుండా పోతుంది.
​ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చి, 12 నుండి 13 గంటల వరకు పని చేయించుకునేలా యాజమాన్యాలకు వెసులుబాటు కల్పించారు.
​కార్మికులు తమ హక్కుల కోసం యూనియన్లు పెట్టుకునే స్వేచ్ఛను హరిస్తున్నారు.కార్మికులందరికీ నెలకు కనీస వేతనం ₹26,000 అందించాలి.
​ఈఎస్ఐ, పీఎఫ్, సౌకర్యాలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి.
​విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు ₹25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి, ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్, వాటర్ బోర్డ్ మరియు ఎలక్ట్రిసిటీ విభాగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు మోహన్ రెడ్డి, శ్రీదేవి, జయ, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పర్వతాలు, రామకృష్ణ, శీను, రాములు, సీఐటీయూ జిల్లా నాయకులు మాణిక్యం, శ్రీను, పరమేష్, శాంతయ్య, ఏఐసీటీయూ నాయకులు నారాయణ, సుల్తానా బేగం మరియు రైతు సంఘం నాయకులు తుకారాం నాయక్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల నిరసన కార్యక్రమం…

రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఆశ వర్కర్ల నిరసన కార్యక్రమం.

చిట్యాల, నేటి ధాత్రి :

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో గురువారం రోజున కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక రైతు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు నశించాలి
దేశ వ్యాపిత్త స్వరత్రిక సమ్మె విజయవంతం చేయాలని, *తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చింతల రజనీకాంత్ ఆధ్వర్యంలో ఆశ వర్కర్లతో నిరసన కార్యక్రమం తెలపడంజరిగింది*ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
4 లేబర్ కోడులను రద్దు చేయాలి.వి బి జి రామ్ ఈ చట్టాన్ని రద్దు చేయాలి.నూతన జాతీయ విత్తన చట్టాన్ని రద్దు చేయాలి,విద్యుత్ {సవరణ} బిల్లు – 2025 ను రద్దు చేయాలి.ఇన్సూరెన్స్ రంగంలో 100% ఎఫ్ డి ఐ ని రద్దు చేయాల,ప్రభుత్వ రంగ సంస్థలను పరిశ్రమలను ప్రైవేటీకరించరాదు,కనీస వేతనం 26,000గా నిర్ణయించాలి.స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలి,కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలి*.
ఎం వి యాక్ట్ – 2019 సవరించాలి అని అన్నారు, ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు రమాదేవి.
సాయి,వేద, కౌసల్య, సుమలత, రజిత,స్వప్న, ఆదిలక్ష్మి,సుమలత,డి సుజాత, జ్యోతి లక్ష్మి, విశాల, సునీత, విజయ, కృష్ణవేణి, సరోజన,నాగరాణి, కోమల తదితరులు పాలుగోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version