108 వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన హెల్త్ సర్వీస్ ఆడిట్ అధికారి కిషోర్…

108 వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన హెల్త్ సర్వీస్ ఆడిట్ అధికారి కిషోర్.

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,,నేటిధాత్రి

మండల కేంద్రంలో గ్రామ గ్రామానికి సేవలందిస్తున్న 108 వాహనాన్ని జీవీకే గ్రీన్ హెల్త్ సర్వీస్ ఆడిట్ అధికారి కిషోర్, భద్రాచలం డివిజన్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ మనోహర్ తో కలిసి 108 వాహనాన్ని ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేసి. అనంతరం 108 వాహనంలో ఉండే పరికరాలు, మందులలభ్యత,బీపి అపరేటర్,ఆక్సిజన్, నిల్వలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఈఎంటి, పైలెట్లు నిత్యం 108 వాహనానికి అందుబాటులో ఉండే వచ్చిన ఎమర్జెన్సీ కాలనీ లిఫ్ట్ చేసి అతి త్వరలోనే రోగులను ప్రభుత్వ హాస్పటల్ కి చేరవేర్చే విధంగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో 108 ఈఎంటి బట్టా.సుమలత, పుల్లయ్య, పైలెట్ గాడిపల్లి సాయి, సాంబశివరావు పాల్గొన్నారు.

.ప్రభుత్వ భూములు పరిరక్షించండి…

.ప్రభుత్వ భూములు పరిరక్షించండి
. కబ్జాలను తొలగించండి
.అమీన్పూర్ డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన ఈర్ల వెంకటేష్

నేటి ధాత్రి, పాటన్ చేరు :

కృష్ణారెడ్డిపేట 164 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో కబ్జాలు జరుగుతున్నాయి అంటూ పలుమార్లు ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ రెవిన్యూ అధికారులు చర్యలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శిస్తున్నారని పటేల్ గూడా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈర్ల వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు..సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట రెవెన్యూ సర్వేనెంబర్ 164 రెవిన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమి. అని ప్రధానంగా మాజీ ఎంపీపీ ఈర్ల దేవానంద్ కబ్జాకు పాల్పడినట్టు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన అధికార యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అమీన్పూర్ తహసిల్దార్ ఆర్డర్ నెంబరు బి /413/2023 ప్రకారం కబ్జాలను తొలగించాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు మౌనం వహిస్తున్నారు… ఇప్పటికైనా 164 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూముల్లో ఉన్న అక్రమాలను తొలగించి విలువైన ప్రభుత్వములను కాపాడాలని కబ్జాదారులపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని పటేల్ గూడా ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈర్ల వెంకటేష్ అన్నారు ఎంతో విలువైన ప్రభుత్వ భూములు ప్రభుత్వ అవసరాల కోసం ప్రభుత్వ కార్యాలయాల కోసం పాఠశాలలు ఆసుపత్రులు ఏర్పాటు కోసం కాకుండా బెల్ట్ షాపుల మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం ఎంతో బాధాకరమని ప్రభుత్వ భూమిని కబ్జా చేయడంతో పాటు బెల్ట్ షాపులకు ఇచ్చి అద్దె వసూలు చేస్తున్న ఘనత మాజీ ఎంపీపీ ఈర్ల దేవానందుదేనని,ప్రజాప్రతినిధిగా చలామణి అవుతున్న వ్యక్తి ఈ రకమైన కబ్జాలకు పాల్పడడం సమంజసం కాదని అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ యంత్రాంగం పారదర్శకంగా వ్యవహరించి ప్రభుత్వ భూములలో నిర్మాణాలను తక్షణమే తొలగించాలని కోరారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version