ఈ పాల ఉత్పత్తులు క్యాన్సర్ కణాలను చంపుతాయని మీకు తెలుసా..

 ఈ పాల ఉత్పత్తులు క్యాన్సర్ కణాలను చంపుతాయని మీకు తెలుసా?

 

పాల ఉత్పత్తులు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయా? ఇందులో నిజమెంతో ఆరోగ్య నిపుణుల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం..

ఇంటర్నెట్ డెస్క్: ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత ప్రాణాంతకం. అయితే, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే కొన్ని ఆహారాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కేవలం పండ్లు, కూరగాయలు మాత్రమే కాకుండా కొన్ని పాల ఉత్పత్తులు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ఏ పాల ఉత్పత్తులు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
పెరుగు

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రోబయోటిక్స్ పేగు ఆరోగ్యం, రోగనిరోధక శక్తికి చాలా అవసరం. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పేగులో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన పేగు మంచి రోగనిరోధక శక్తి, జీర్ణక్రియతో ముడిపడి ఉంటుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో పెరుగు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

లస్సీ

లస్సీ శరీరాన్ని చల్లబరచడానికి, హానికరమైన రసాయనాలు, వ్యర్థ పదార్థాలను తొలగించడానికి, మంటను తగ్గించడానికి చాలా అవసరం. లస్సీలో కొవ్వు తక్కువగా ఉంటుంది. ప్రోబయోటిక్స్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. లస్సీ శీతలీకరణ ప్రభావం జీర్ణక్రియకు సహాయపడుతుంది. క్యాన్సర్ కలిగించే టాక్సిన్స్ నుండి శరీరాన్ని రక్షిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

జున్ను

జున్నులో ప్రోటీన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. కాల్షియం, సెలీనియం కూడా ఉంటాయి. సెలీనియం యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ కణాలను ఆక్సీకరణ నష్టం నుండి రక్షిస్తుంది. తద్వారా క్యాన్సర్ నివారణలో ముఖ్య పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.

నెయ్యి

నెయ్యి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పోషకాలను గ్రహించడానికి సహాయపడుతుంది. నెయ్యిని మితంగా తీసుకోవడం వల్ల శరీరానికి సంయోజిత లినోలెయిక్ ఆమ్లం (CLA) లభిస్తుంది. ఇది క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి ఉండవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

పాలు

పాలు.. కాల్షియం, విటమిన్ డి అందిస్తాయి. ఇవి బలమైన ఎముకలకు అవసరం. కాల్షియం తీసుకోవడం వల్ల పేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఆవు పాలు మితంగా తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

భోజనం తర్వాత సోంపు ఎందుకు పెడతారు…

హోటళ్లలో భోజనం తర్వాత సోంపు, చక్కెర మిఠాయిలు ఎందుకు పెడతారో తెలుసా.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

 

 

భోజనం తర్వాత సోంపు, చక్కెర మిఠాయిలు తినడం పెద్దల కాలం నుంచి సాంప్రదాయంగా వస్తోంది. అయితే దీని వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..

ఏ హోటల్లోనైనా భోజనం చేయగానే సోపు, చిన్న చిన్న చక్కె మిఠాయిలను కలిపి అందుబాటులో ఉంచుతారు. చాలా మంది అందరితో పాటూ కొన్ని తీసుకుని నోట్లో వేసుకుని నమిలేస్తుంటారు. అంతే తప్ప.. హోటళ్లలో వీటిని ఎందుకు పెడతారు.. వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనే విషయం చాలా మందికి తెలీదు. వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జనం తర్వాత సోంపు, చక్కెర మిఠాయిలు (Fennel and Sweets) తినడం పెద్దల కాలం నుంచి సాంప్రదాయంగా వస్తోంది. అయితే దీని వెనుక అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆహారం త్వరగా జీర్ణం అవడంతో పాటూ నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి కూడా ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు.

సోంపు తినడం వల్ల ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే చక్కెర మిఠాయిలో ఉండే చల్లదనం శరీరంలో ఆమ్లతత్వం, గ్యాస్‌ను తగ్గిస్తుంది. మరోవైపు సోంపులో ఉండే సహజ నూనె నోటికి తాజాదనాన్ని అందిస్తుంది. అదేవిధంగా చక్కెర మిఠాయిలు నోటిని శుభ్రం చేయడంలో సాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. చాలా మంది భోజంన చేసిన తర్వాత ఏదైనా తినాలని అనుకుంటుంటారు. అలాంటి వారికి సోంపు, చక్కెర మిఠాయిలు ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం అని నిపుణులు సూచిస్తున్నారు.

సోంపు, చక్కెర మిఠాయిలను కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందట. అలాగే కడుపు తేలిగ్గా మారుతుంది. మరోవైపు సోంపు పేగు ఆరోగ్యం, పోషకాల శోషణను మెరుగుపరుస్తుంది. అదేవిధంగా మెనోపాజ్ సమయంలో మహిళలు ఎదుర్కొనే అనేక సమస్యల నుంచి సోంపు ఉపశమనం కలిగిస్తుంది. అయితే వీటిని అతిగా తీసుకుంటే మాత్రం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version