దళితుల హక్కుల కోసం పోరాడిన DR జగ్జీవన్ రామ్.

దళితుల హక్కుల కోసం పోరాడిన సంఘసంస్కర్త డాక్టర్ జగ్జీవన్ రామ్

ఆయన జీవితం యువతకు స్ఫూర్తి దాయకం

కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి

శాయంపేట నేటిధాత్రి:

 

 

సమాజంలో దళిత బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన యోధుడు గొప్ప సంఘ సంస్కర్త జగ్జీవన్ రామ్ అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ధూదిపాల బుచ్చిరెడ్డి అన్నారు ఈరోజు ఆయన జయంతిని పురస్క రించుకొని కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన మహానుభా వుడు జగ్జీవన్ రామ్ దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక భూమిక పోషించడమే కాకుండా స్వాతంత్ర అనంత రం చిన్న వయసులో కేంద్ర క్యాబినెట్ లొ కార్మిక కమ్యూని కేషన్ మంత్రిగా పని చేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది ఆయన జీవితం నేటి యువత ఆదర్శంగా తీసుకొనిపనిచేయా లని అన్నారు ఈ కార్యక్ర మంలో కాంగ్రెస్ నాయకులు మారపల్లిరవీందర్ ,చిందం రవి దుబాసి కృష్ణమూర్తి, కట్టయ్య, మార్కండేయ, మస్క కుమారస్వామి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version