ఘనంగా.. శ్రీ దత్త ఆసుపత్రి మొదటి వార్షికోత్సవం…

ఘనంగా.. శ్రీ దత్త ఆసుపత్రి మొదటి వార్షికోత్సవం

బాలానగర్ /నేటి ధాత్రి

 

బాలానగర్ మండల కేంద్రంలోని స్థానిక రైల్వే స్టేషన్ కు వెళ్లే దారిలో ఉన్న శ్రీ దత్త హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్వహకురాలు.. డాక్టర్ మౌనిక (ఎండి) మాట్లాడుతూ.. ఈనెల ఏడో తేదీ వరకు ఓపి, ల్యాబ్ టెస్టులకు 30 శాతం ఫీజు తగ్గింపు ఉంటుందని అన్నారు. మండలంలోని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. తక్కువ ఫీజులతోనే మండలంలోని రోగులకు ఆపరేషన్లు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందమోని దత్తాత్రేయ, మాజీ సర్పంచ్ సాటి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కుర్వ శ్రీను, డాక్టర్ మారుతి, ప్రసన్నకుమార్, సచిన్, భాస్కర్ రెడ్డి, శ్రీకాంత్ ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version