ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థులకు కంటి అద్దాల పంపిణి

*నులిపురుగుల నివారణ మాత్రలు అందజేత..

*విద్యార్థులు సెల్ ఫోన్ వాడకం తగ్గించాలని హితవు.

పలమనేరు(నేటి ధాత్రి) ఫిబ్రవరి 10:

పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా పలువురు విద్యార్థులకు ఉచితంగా కంటి అద్దాల పంపిణీ చేశారు. జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో పట్టణంలోని బాలిక ఉన్నత పాఠశాల మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాలలలో ఈ కార్యక్రమం సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే మాట్లాడుతూ…. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే చదువుపై శ్రద్ధ పెట్టగలరని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పలు కార్యక్రమాలను చేపడుతున్నాయన్నారు.అందులో భాగంగా కంటిచూపు సమస్యలను పరిష్కరించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. విద్యార్థులు సెల్ఫోన్ వాడకంతో కంటి చూపును త్వరగా కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున సెల్ ఫోన్ వాడకాన్ని తగ్గించుకోవాలని సూచించారు. అనంతరం కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న పలువురు విద్యార్థినిలకు ఆయన కంటి అద్దాలను పంపిణీ చేశారు.

నులిపురుగు నివారణ మాత్రల పంపిణి..

నులిపురుగు నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నులి పురుగు నివారణ మాత్రలైన ఆల్బెండజోల్ టాబ్లెట్లను ఈ సందర్భంగా ఆయన విద్యార్థినీలకు పంపిణీ చేశారు. అంతకుముందు నులిపురుగులతో తలెత్తే ఆరోగ్య సమస్యలపై అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ప్రతి ఒక విద్యార్థిని తప్పనిసరిగా ఆల్బెండజోల్ టాబ్లెట్లను తీసుకోవాలని ఎమ్మెల్యే విద్యార్థులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమాలలో పలమనేరు కో-ఆపరేటివ్ సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్.వి.బాలాజీ, జిల్లా అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ అర్పిత, ఎంఈఓ బాలసుబ్రమణ్యం,బాలిగోన్నత పాఠశాల హెచ్ఎం లత,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం పాఠశాల ప్రిన్సిపాల్ ప్రశాంతి,పీ.ఎం. ఓ.ఓ మధు,ఎం. పి.హెచ్.ఈ.ఓ జయశంకర్ మరియు టీడీపీ నాయకులు ఆర్ బి సి,కుట్టి, గిరిబాబు, సుబ్రహ్మణ్యం గౌడ్, నాగరాజు, శ్రీధర్, కిరణ్, బీ ఆర్ సీ కుమార్, సుధాకర్, శంకరప్ప తదితరులు ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version