అప్పలరావుపేటలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక పర్యటన

అప్పలరావుపేటలో అడిషనల్ కలెక్టర్ ఆకస్మిక పర్యటన

గ్రామపంచాయతీ ,నర్సరీ, పాఠశాలల సందర్శన

మధ్యాహ్న భోజనం పరిశీలన

#నెక్కొండ, నేటి ధాత్రి:

మండలంలోని అప్పలరావుపేటలో మంగళవారం జిల్లా అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) శ్రీ వై వి గణేష్ గారు ఆకస్మిక పర్యటన జరిపారు. ఎంపీడీవో శ్రీ దయాకర్ తో కలిసి ప్రభుత్వ పాఠశాలలు, నర్సరీ ,గ్రామపంచాయతీలను సందర్శించారు. నర్సరీలో మొక్కల పెంపకం నిర్వహణ తీరును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ప్రజా పాలనలో రోజు వారి కార్యక్రమాల ప్రగతి నివేదికల పై సమీక్షించారు.

ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో అడిషనల్ కలెక్టర్ ను శాలువాతో సత్కరించారు. అలాగే అప్పలరావుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పంపిణీ పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారం, మెనూ వివరాలను ఇన్చార్జి హెడ్మాస్టర్ శ్రవణ్ కుమార్ ను వివరాలు అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. భోజన నాణ్యత పై విద్యార్థులతో మాట్లాడారు.అలాగే ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అభ్యసన ప్రగతిని పరిశీలించారు. రోజు వారి కార్యక్రమాలపై పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో దయాకర్ గారు, గ్రామ సర్పంచ్ ఊడుగుల అశోక్, గ్రామ కార్యదర్శి నరేష్, వార్డు సభ్యులు, ఏకాంబరం ,బోళ్ళ కుమార్, శ్రీనివాస్, గ్రామపంచాయతీ సిబ్బంది కిరణ్, ఉన్నత పాఠశాల ఇన్చార్జి హెడ్మాస్టర్ శ్రవణ్ కుమార్ ప్రాథమిక పాఠశాల ఇన్చార్జ్ హెడ్మాస్టర్ నూరజ్, పాఠశాల ఉపాధ్యాయులు రవీంద్రనాథ్, గీత ,యాకయ్య, భూలక్ష్మి ,వెంకట్రాజం, దయాకర్, శ్రీనివాసాచారి , తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సన్మాన కార్యక్రమం…

ఘనంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు సన్మాన కార్యక్రమం

* ఎమ్మెల్యే చేతుల మీదుగా ఉత్తమ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులు.

చేవెళ్ల, నేటిధాత్రి:

 

 

 

చేవెళ్ల ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు జి. వెంకటరమణకుమార్. ఎం. సంతోషి ఉపాధ్యాయులు విద్యారంగంలో వారు చేసిన విశేష సేవలకు గుర్తింపుగా ఈ గౌరవ ఉత్తమ పురస్కారాలు అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా జిల్లా విద్యాశాఖ
ఉత్తమ ఉపాధ్యాయులకు వారి సేవలను గుర్తించి ఉత్తమ పురస్కారాలను అందించింది.
చేవెళ్ల ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ సాంఘీకశాస్త్రంలో ఉత్తమ సేవలు అందించిన జీ.

 

 

 

 

వెంకటరమణకుమార్ కలెక్టరేట్ లో బుధవారం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు. గురువారం చేవెళ్ల మున్సిపల్ పట్టనకేంద్రంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చేవెళ్ల మండల ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య చేతుల మీదుగా ఉపాధ్యాయురాలు సంతోషి మండల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారు.

 

 

 

 

 

గణిత శాస్త్రంలో ఉత్తమ సేవలు అందించిననందుకు ఈ పురస్కారం దక్కింది. ఉత్తమ పురస్కారాలు అందుకున్న వెంకటరమణకుమార్, సంతోషి ఉపాధ్యాయులను, ఎంఈఓ పురందాస్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు నర్సింహా, సుధాకర్, శృతి, అలివేలు రజిత, అరుణ, అనిత పలువురు ఉపాధ్యాయులు మాజీ ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించి ప్రశంశించారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, మాట్లాడుతూ తమ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులకు ఉత్తమ పురస్కారాలు అందుకోవటం అభినదనీయమని అన్నారు. ఒక ఉపాధ్యాయుడిగా ఆయన సాధించిన విజయాలు ఒక్క రోజులో వచ్చినవి కావు, అవి ఆయన పట్టుదల, నిరంతర కృషికి నిదర్శనం అన్నారు. కార్యక్రమంలో

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version