తిరుపతిలో కల్తీ లడ్డుపై టిడిపి ఆగ్రహం, భక్తులను రక్షించాలి

*తిరుపతిని,దేవుడిని అప పవిత్రం చేయకండి…

*టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం..

తిరుపతి( నేటి ధాత్రి:

తిరుమల ఆధ్యాత్మిక ధర్మక్షేత్రం, హిందువుల మనోభావాలకు, భక్తులకు నిలువెత్తు నిదర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి అని, అటువంటి స్వామిని, టిటిడిని గత ప్రభుత్వ వైసిపి పాలనలో టీటీడీ బోర్డు చైర్మన్,ఈవో, సభ్యులు ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడ్డారని, లడ్డులో నెయ్యి బదులు మోనో లేజర్ లైట్ కెమికల్ రసాయన పదార్థం జంతువుల కొవ్వు నుండి వస్తుందని ఉన్నారు. అటువంటి రసాయనాన్ని లడ్డు కల్తీలో వాడారని, తిరుపతిని, దేవుడిని అప పవిత్రం చేయకుండని శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం అన్నారు. లడ్డు నాణ్యతను, కల్తీ విసయాన్ని కుటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ వేశారన్నారు. భక్తులు కల్తీ లడ్డును తినడం ద్వారా 50% క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ఆరోపించారు. భక్తి భావం, సేవ పదాలకు అర్థం తెలియని మూర్ఖులు ఉజ్జయిని, ఇతర రాష్ట్రాల శివాలయాలు తిరిగి, ఇప్పుడు హోమాలు నిర్వహిస్తే చేసిన తప్పులు చెరిగిపోవున్నారు. ఇంకా ఐదేళ్ల పాలన ప్రజలు వైసీపీకి ఇచ్చి ఉంటే వెంకటేశ్వర స్వామి పక్కన జగన్ ఫోటో, లడ్డు కవర్ల పైన జగన్ ఫోటో పెట్టాలని టిటిడి బోర్డు లో తీర్మానం చేసే వాళ్ళని అన్నారు. ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి బుల్లెట్ రమణ, టిడిపి బీసీ సెల్ నాయకులు కృష్ణ యాదవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి మధుబాబు,టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ వెంకట పుష్పావతి యాదవ్, హేమంత్, విశ్వనాథం, నంద, హైమావతి తదితరులు పాల్గొన్నారు..

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version