రోడ్డు భద్రత కోసం సిరిసిల్ల ఎస్పీ ట్రాఫిక్ నిబంధనల పాటింపుని కోరారు

ప్రతి ప్రాణం విలువైనదే…అందరూ బాధ్యతగా వ్యవహరించాలి.

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే ప్రాణాలకు భద్రత:జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే.

రోడ్డు భద్రతే లక్ష్యంగా సిరిసిల్ల పట్టణ కేంద్రంలో “అరైవ్–అలైవ్” రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం.

 

సిరిసిల్ల(నేటి ధాత్రి):

సిరిసిల్ల పట్టణ పోలీస్ వారి ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన“అరైవ్–అలైవ్” రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమానికి జిల్లా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా హాజరై వాహనదారులకు,విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ….పోలీసులు ఎంత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా,ప్రజలు రోడ్లపై ప్రయాణించే సమయంలో రోడ్డు భద్రత,ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు.మనం నిబంధనలు పాటించినప్పటికీ, ఎదుటివారి నిర్లక్ష్యం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశముందని, అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతతో వాహనాలు నడపాలని సూచించారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా నియంత్రించవచ్చని పేర్కొన్నారు.గౌరవ ముఖ్యమంత్రి, రాష్ట్ర డీజీపీలు రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రాణాల రక్షణ లక్ష్యంగా ప్రారంభించిన “అరైవ్–అలైవ్” కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి గ్రామం,పట్టణం, కాలనీ వరకు ప్రజల్లో అవగాహన కల్పించేలా కొనసాగుతుందని తెలిపారు.వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చని స్పష్టం చేశారు.

అనంతరం వాహనాలకు రోడ్ సేఫ్టీ అవగాహన పోస్టర్లు అట్టించి అధికారులు,వాహనదారులతో కలసి ఎస్పీ గారు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ కృష్ణ, ఆర్.ఐ సురేష్, ట్రాఫిక్ ఆర్.ఎస్.ఐ దిలీప్ సిబ్బంది,నేతాజీ డిగ్రీ కలశాల విద్యార్థులు పాల్గొన్నారు.

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన బాలానగర్ పోలీసులు

“హెల్మెట్ ధరించండి ప్రాణాలు రక్షించుకోండి”

ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి.

 

బాలానగర్ ఎస్సై లెనిన్.

 

తెలంగాణ రాష్ట్ర డీజీపీ శ్రీ శివధర్ రెడ్డి ప్రారంభించిన “ఆరైవ్ లైవ్” నినాదం ద్వారా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో, పల్లె పల్లెనా ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని పోలీసు శాఖకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఈ ఆదేశాల అమలులో భాగంగా, బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం గుండెడ్ గ్రామం నందు బాలానగర్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ లెనిన్ మరియు సిబ్బంది రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు క్రింది విషయాలపై విస్తృతంగా అవగాహన కల్పించారు:
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి
నాలుగు చక్రాల వాహనదారులు సీట్‌బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలి
త్రిబుల్ రైడింగ్ చేయరాదు
మద్యం సేవించి వాహనాలు నడపకూడదు
రాంగ్ రూట్ డ్రైవింగ్, రాంగ్ ఓవర్టేక్ నివారించాలి
మైనర్లు వాహనాలు నడపరాదు
ట్రాఫిక్ నియమాలు కచ్చితంగా పాటించాలి
ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పోలీసులు వివరించారు. ప్రతి పౌరుడు రోడ్డు భద్రతపై బాధ్యతగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించడం ద్వారా తమతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా రక్షించవచ్చని ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమం ద్వారా గ్రామస్థుల్లో రోడ్డు భద్రతపై మంచి అవగాహన ఏర్పడిందని పోలీసులు తెలిపారు.

జహీరాబాద్‌లో రోడ్డు భద్రతపై అవగాహన

రోడ్డు భద్రతపై అవగాహన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని జహీరాబాద్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి సైదా నాయక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా, ‘అరైవ్, అలైవ్’ నినాదంతో జహీరాబాద్ పోలీసులు స్థానిక మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారంలో కార్మికులకు రోడ్డు భద్రత నియమాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం బాధ్యతగా భావించాలని, అది ప్రాణాలను కాపాడే ముఖ్యమైన సాధనమని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version