స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అభివృద్ధి చేస్తున్నాం

స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి

కట్కూరి దేవేందర్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు

పరకాల,నేటిధాత్రి

 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించుకునే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సర్పంచులను గెలిపించుకొని కాంగ్రెస్ పార్టీ జెండా గ్రామాలలో అత్యధికంగాఎగరవేయాలని వారి గెలుపు కొరకై ప్రతి ఒక్కరు పని చేసే విధంగా ముందుండాలని మండల అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి అన్నారు.మండలంలోని అలియాబాద్,వెల్లంపల్లి గ్రామాలలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరై అయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఎంతో దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సారధ్యంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ అనేక సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించే రీతిలో కృషి చేస్తున్నారని,పరకాల నియోజకవర్గంలోని అన్ని మండలాలను అభివృద్ధి కోసమే పనిచేసే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ అన్ని వర్గాలకు కలుపుకొని రాష్ట్ర ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి అభివృద్ధి చేపడుతున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల మండల సమన్వయ కమిటీ సభ్యులు నలుబోలు కిష్టయ్య, కొత్తపల్లి రవి,బొజ్జం రమేష్, అల్లం రఘు నారాయణ, దుగ్యాల రాజేశ్వరరావు, ఇనుగాల రమేష్,తక్కలపల్లి స్వర్ణలత జీవన్,పల్లెబోయిన శ్రీనివాస్,ఎఎంసి డైరెక్టర్ పెండ్యాల కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు సూర్యం,విజేందర్ రెడ్డి, మహేందర్,శ్రీనివాస్, విజేందర్,పెండ్యాల రమేష్, అలియాబాద్,వెల్లంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version