మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు…

మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు

మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఈ నెల 10 జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు.మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్ లతో గురువారం మాజీ ఎమ్మెల్యే పెద్ది సమీక్షా సమావేశం నిర్వహించారు.ముందుగా మున్సిపాలిటీ ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకున్నా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ ఎన్నికలలో విజయం కోసం పోరాటం చేసినా బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు,కార్యకర్తలకు,శ్రేణులకు,నాయకులకునా అభినందనలు తెలిపారు.ఈ మున్సిపల్ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందన్నారు.
శుక్రవారం ఎన్నికల కౌంటింగ్ జరుగనున్న నేపథ్యంలో అభ్యర్థులు, ఏజెంట్లు నిర్ణిత సమయానికి కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలని,ఓట్ల లెక్కింపు వద్ద అభ్యర్థులు,ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు,స్థానిక పోలీసుల ఒత్తిళ్లను తట్టుకొని బిఆర్ఎస్ పార్టీ విజయం కోసం పార్టీ శ్రేణులు పోరాటం చేశారన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి,నియోజకవర్గ కోఆర్డినేటర్ తక్కల్లపల్లి రవీందర్ రావు, పట్టణ పార్టీ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ మునిగాల వెంకట్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ బాధ్యులు, మాజీ ఎంపీపీ, జిల్లా నాయకులు,అభ్యర్థులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో కాంగ్రెస్ మున్సిపాలిటీ ఎన్నికల సమీక్ష

*మున్సిపాలిటీ ఎన్నికల సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు*

◆-: ఎంపీ.సురేష్ కుమార్ షెట్కార్

◆-: మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్

◆-: సెట్విన్ ఛైర్మెన్ గిరిధర్ రెడ్డి

◆-: రాష్ట్ర నాయకులు డాక్టర్ ఉజ్వల్ రెడ్డి

◆-: మాజీ ఇండస్ట్రియల్ చైర్మెన్ తన్వీర్

*జహీరాబాద్ నేటి ధాత్రి:*

జహీరాబాద్ పట్టణంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో జహీరాబాద్ మున్సిపాలిటీ మరియు నూతనంగా ఏర్పాటు చేసిన కోహిర్ మునిసిపాల్టీల ఎన్నికల సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో మాజీ మంత్రివర్యులు డా||చంద్రశేఖర్ ప్రసంగిస్తూ రానున్న మునిసిపల్ ఎన్నికల్లో అందరూ నాయకులు కార్యకర్తలు సమీక్షిగా పని చేసి కాంగ్రెస్ జెండా ఎగరవేయలని కొరకు, అలాగే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పార్టీ పరంగా సమన్వయం పాటించి అధిష్టానం మొగ్గు చూపినా వారికే ఈ ఎన్నికల్లో పని చేసి ప్రతి ఒక్కరికీ మన కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమా పథకాలను వివరించి జరుగుతున్న అభివృద్ధిని చూపిస్తూ అభ్యర్థుల గెలుపు దిశగా కృషి చేసి జహీరాబాద్ లో మరియు కోహిర్ లో కాంగ్రెస్ జెండా ఎగరేవేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఇండస్ట్రియల్ చైర్మెన్ తన్వీర్,కాంగ్రెస్ నాయకులు ఉజ్వల్ రెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రామ లింగారెడ్డి, పట్టణ అధ్యక్షులు కండేం.నర్సింలు, మండల అధ్యక్షులు హన్మంత్ రావ్ పాటిల్ ,మాక్సూద్ అహ్మద్,నరసింహా రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్షద్ అలీ,మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబ్బాసుం,కాంగ్రెస్ నాయకులు మంకల్ శుభాష్,హుగ్గేల్లి రాములు,కోహిర్ పట్టణ అద్యక్షులు శంషీర్,మాజీ ఎంపీపీ షౌకత్ అలీ తదితరులు పాల్గొన్నారు..

ఎన్నికల సమావేశంలో పాల్గొన్న ఏఐఎంఐఎం నాయకులు…

ఎన్నికల సమావేశంలో పాల్గొన్న ఏఐఎంఐఎం నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఏఐఎంఐఎం జాతీయ అధ్యక్షుడు మరియు హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ మరియు మన సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ కార్వాన్ ఎమ్మెల్యే జనాబ్ కౌసర్ మొహియుద్దీన్ సూచనల మేరకు, ఈరోజు మునిసిపల్ జహీరాబాద్‌లో కమిషనర్ ఎంసీజెడ్ తహశీల్దార్ జహీరాబాద్‌తో జరిగిన ఎన్నికల సమావేశంలో ఏఐఎంఐఎం జహీరాబాద్ అధ్యక్షుడు మహ్మద్ అథర్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి మొహియుద్దీన్ ఘౌరి సహబ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అజ్మత్ పాషా మరియు పార్టీ క్యాడర్‌తో కలిసి పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version