ఆర్యవైశ్య సంఘం నాయకుల ఆగ్రహం.
కల్వకుర్తి/ నేటి ధాత్రి :
కల్వకుర్తి నియోజకవర్గం లోని
ఆమనగల్ పట్టణంలో నిన్న ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఆమనగల్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ లో గెలిచిన అభ్యర్థి పత్యానాయక్ ని కాంగ్రెస్ బిజెపి కలసి కుట్ర పన్ని కాంగ్రెస్ లో కి తీసుకొని మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహించి పత్యా నాయక్ ఇంటిని ముట్టడించారు దాంతో అధికార పార్టీ నేతలు ఉప్పల వెంకటేష్, ఆమనగల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ పాపిశెట్టి రామకృష్ణ పై అక్రమ కేసులు బనయించడం తో అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేయాలని కల్వకుర్తి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తక్షణమే పెట్టిన కేసులను ఎత్తివేయాలి లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్య సంఘాలు అనుబంధ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా బంద్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య సంఘ అనుబంధ సంస్థల నాయకులు పాల్గొన్నారు.
