గ్రామసభ నిర్వహణ…

గ్రామసభ నిర్వహణ

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలో బుధవారం స్థానిక సర్పంచ్ మోడీ రవీందర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి ఎద్దడి ఉన్నందున, నీటి సరఫరాపై తగు చర్యలు తీసుకుంటామని ప్రతి ఇంటికి సరిపడా నీటిని అందజేస్తామన్నారు నీటిని వృథా చేయకుండా వాడుకోవాలని సూచించారు. ఇంకా దోమల నివారణ, చర్యలు చేపడతామని తెలిపారు. గ్రామంలో అభివృద్ధి పనులు అంతర్గత సిసి రోడ్లు, కొత్త డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంబించామని తెలిపారు. సిబ్బందితో అన్ని వార్డులలో పారిశుద్ధ్యం పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సిబ్బంది సంఖ్య తక్కువగా ఉన్న అదనంగా సిబ్బందిని పెట్టి పనులు కోన సాగిస్తున్నాం అని తెలిపారు. ఈకార్య క్రమంలో పంచాయతీ కార్యదర్శి సూర్య ప్రకాష్, ఉప సర్పంచ్ కట్ల రాములు, వార్డు సభ్యులు తడగొండ రాజు, పాదం ఉమ, పాదం రాజయ్య, పన్యాల విద్యా సాగర్, పెంచాల అంజయ్య, డా.మౌనిక, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాలు అధ్యక్షులు సులోచన, సీఏలు వనజ, రజిత, లైన్ మెన్ గాల్ రెడ్డి, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా…

వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా

నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

కౌన్సిలర్ లతో వార్డుల్లో పర్యటించిన చైర్ పర్సన్ పెండెం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ హామీ ఇచ్చారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 17, 9వ వార్డుల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు 17వ వార్డు కౌన్సిలర్ సలావుద్దీన్ అయూబ్ ఖాన్,సంబంధిత అధికారులతో కలిసి తో కలిసి చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్ లు పర్యటించారు. 17వ వార్డు మరియు 9వ వార్డుల్లో అవసరమైన సీసీ రోడ్డు, సైడు కాలువల నిర్మాణ పనులు చేపట్టి, నీటి సమస్య, పారిశుద్ధ పనులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి వార్డులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.అర్హులందరికీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందించే పథకాలు అందిస్తామని తెలిపారు.వార్డుల్లో ఎక్కడ సమస్య ఉన్న వెంటనే స్పందించి తమదృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు కాట శ్రీనివాస్, జూలూరి కావ్య, వాటర్ సప్లై కొల్లూరి రంజిత్, వార్డు జవాన్ మాదాసి భరత్, మాజీ కౌన్సిలరు మేర్గు సాంబయ్య, మాజీ ఎంపీటీసీ పేరం బాబు రావు, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మసూద్ భాయ్, 9వ వార్డు అధ్యక్షులు గిరగాని రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల వీరస్వామి, మేరుగు కిరణ్, ఆకుల శ్రీను, దండు నవీన్, బండారు శివ, నామాసు వెంకటేశ్వర్లు, సల్మాన్, సాయి, మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version