రౌడీమూకలపై ఉక్కుపాదం.. కఠిన చర్యలు చేపట్టిన ఏపీ పోలీసులు…

రౌడీమూకలపై ఉక్కుపాదం.. కఠిన చర్యలు చేపట్టిన ఏపీ పోలీసులు

 

కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో తాగుబోతుల ఆగడాలకు పోలీసులు గట్టి హెచ్చరిక ఇచ్చారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన యువకులపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు.

మచిలీపట్నంలో (Machilipatnam) తాగుబోతుల ఆగడాలకు పోలీసులు గట్టి హెచ్చరిక ఇచ్చారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన యువకులపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. నిందితులను నడిరోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… నిన్న(శనివారం) రాత్రి మచిలీపట్నంలోని గణేశ్ భవన్ ప్రాంతంలో ముగ్గురు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. పాదచారులపై దాడికి పాల్పడటమే కాకుండా.. సమీపంలోని సిటీ కేబుల్ ఆఫీస్‌పై కూడా దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version