డ్రంక్ అండ్ డ్రైవ్ _రోడ్డు భద్రతపై అవగాహన. ఎస్సై ఎం సురేష్.

డ్రంక్ అండ్ డ్రైవ్ _రోడ్డు భద్రతపై అవగాహన. ఎస్సై ఎం సురేష్.

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి.

 

భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల డ్రంక్ అండ్ డ్రైవ్ _రోడ్డు భద్రతపై ప్రతి పౌరుడు అవగాహన కల్పించుకోవాలని ఎస్ఐ ముప్పు సురేష్ అన్నారుఇప్పలపల్లి గ్రామపంచాయతీ వద్ధ , మొగుళ్లపల్లి పోలీస్ స్టేషన్ పరిమితిలో “ డ్రంక్ అండ్ డ్రైవ్ ” అంశంపై అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా*మొగుళ్లపల్లి ఎస్సై ఎం. సురేష్*పాల్గొన్నారు ఎస్సై మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం మద్యం సేవించి వాహనం నడపడమేననిఇది కుటుంబాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదకరమైన అలవాటని అన్నారు మద్యం సేవించి వాహనం నడపడం వల్ల జరిగే ప్రమాదాలు, ప్రాణనష్టం మరియు చట్టపరమైన చర్యల గురించి వివరించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ను నియంత్రించేందుకు మొగుళ్లపల్లి పి.ఎస్ పరిధిలో ప్రత్యేక డ్రైవులు మరియు క్రమం తప్పని తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నియమాలను తప్పకుండా పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపకూడదని, వాహనదారులు తప్పనిసరిగా అన్ని రకాల పత్రాలు కలిగి ఉండాలన్నారు ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని అన్నారు తమతో పాటు ఇతరుల భద్రతను కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ముఖ్యంగా యువత ముందుగా మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఎంతగానో ఉందని పేర్కొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version