అత్నూర్ గ్రామంలో రూ.10 లక్షల సైడ్ డ్రైనేజీ పనులు ప్రారంభం…

అత్నూర్ గ్రామంలో రూ.10 లక్షల సైడ్ డ్రైనేజీ పనులు ప్రారంభం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం అత్నూర్ గ్రామంలో బుధవారం సైడ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం ఎంపీ కోటా కింద మంజూరైన రూ.10 లక్షల నిధులతో ఈ పనులు చేపట్టారు. గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని నాయకులు తెలిపారు. ఈ పనులు గ్రామ అభివృద్ధికి దోహదపడతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ, నూతన సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీరాజ్ అధికారులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version