వెలుగులోకి సోమనాథ క్షేత్ర నిజ శివలింగ భగ్నావశేషం

సోమనాధ దేవాలయంలో ప్రతిష్టకు సన్నాహాలు

ప్రతిష్ట బాధ్యతలు స్వీకరించిన ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అధినేత శ్రీశ్రీ రవిశంకర్‌

ప్రత్యేక అయస్కాంత లక్షణాన్ని కోల్పోని శివలింగం

అప్పట్లో భూమిపై రెండడుగుల ఎత్తులో శివలింగం వుండేది

శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘజనీ

కొన్ని అవశేళాలను భద్రపరచిన అగ్నిహోత్రీయ బ్రాహ్మణులు

వెయ్యేళ్ల తర్వాత వెలుగులోకి

హైదరాబాద్‌,నేటిధాత్రి:
దాదాపు వెయ్యేళ్ల క్రితం ఇస్లామిక్‌ చొరబాటు దారుడు మహమ్మద్‌ ఘజనీ ధ్వంసం చేసిన పవిత్రసోమనాథ జ్యోతిర్లింగాన్ని పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఘజనీ ధ్వంసం చేసిన నిజ శివలింగ భగ్నశకలాలను ప్రస్తుత సోమనాథ దేవాలయంలో ప్రతిష్టించడం ద్వారా ఈ జ్యోతిర్లిం గాన్ని పునరుద్ధరించనున్నారు. స్వాతంత్య్రానంతరం ఈ దేవాలయాన్ని ఉపప్రధాని సర్దార్‌ వల్ల భాయ్‌పటేల్‌, ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్‌ నేతృత్వంలో అరేబియా సముద్రతీరంలోనిర్మించారు. నాడు మహమ్మద్‌ ఘజనీ ధ్వంసం చేసినట్టు చెబుతున్న ఆలయ ప్రదేశానికి స మీపంలోనే ఈ నూతన సోమనాథ దేవాలయం వుంది. ఇదిలావుండగా అప్పట్లో ఘజనీ దండ యాత్ర సందర్భంగా, జ్యోతిర్లింగ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేయడమే కాదు, అక్కడి శివలింగాన్ని ముక్కలుగా పగులగొట్టి, అప్పటికీ కసి తీరక, అందులో ఒక ముక్కను నేటి ఆఫ్ఘనిస్తాన్‌లోని జామా మసీదుకు మెట్టుగా ఉపయోగించాడని చారిత్రక కథనం. అయితే ఆ భగ్న శివలింగానికి చెందిన కొన్ని భాగాలను అప్పటి అగ్నిహోత్రిక బ్రాహ్మణులు తమ ఇళ్లల్లో భద్రపరచినట్టు తెలుస్తోంది. అయితే ఇన్ని వేల సంవత్సరాలు గడిచినా ఈ విషయం ఎవరికీ తెలియదు. ఆవిధం గా భద్రపరచిన భగ్నావశేషాలను ఇప్పుడు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవిశంకర్‌ నేతృత్వంలో సోమనాధ ఆలయంలో ప్రతిష్టించడానికి యత్నాలు జరుగుతున్నాయి.
మనదేశంలోని పవిత్ర ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో సోమనాథ క్షేత్రం ఒకటి. జ్యోతిర్లింగ స్తోత్రంలో మొట్టమొదట ప్రస్తావించేది కూడా ఈ సోమనాధ క్షేత్రాన్నే! వెయ్యేళ్ల క్రితం మనదేశంలో ఇ స్లామిక్‌ చొరబాటుదార్ల దాడులు విపరీతంగా జరిగాయి. ఈ దాడులకు ప్రధానంగా గురవడమే కాదు పూర్తిగా ధ్వంసమైన క్షేత్రం కూడా ఈ సోమనాథ క్షేత్రమే! ఆలయాల్లో బంగారం, ఇతర విలువైన ఆభరణాలు,రత్నాలు వుంటాయన్న సంగతి తెలుసుకున్న ఈ ఇస్లామిక్‌ చొరబాటుదార్లు ఆలయాలే లక్ష్యంగా దారుణ విధ్వంసానికి పాల్పడేవారు. అడ్డువచ్చిన హిందువులను దారుణంగా వధించి ఆలయాల్లో నిక్షిప్తమైన నిధులను దోచుకుపోయేవారు. ఇందులో భాగంగానే క్రీ.శ. 1024లో మహమ్మద్‌ ఘజనీ సోమనాథ క్షేత్రంపై భయంకరమైన దాడికి దిగాడు. అతని ముఖ్య లక్ష్యం ఆలయంలో నిక్షిప్తమైన అపారమైన ధనరాశులను కొల్లగొట్టుకుపోవడమే! అతని దాడినుంచి ఆలయాన్ని రక్షించడానికి హిందువులు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నారు. కానీ ఘజనీ నిర్ద యగా 50వేల మంది హిందువులను ఊచకోతకోసి మరీ ఆలయాన్ని లూటీ చేశాడు. అప్పట్లో శివలింగం కింద కూడా నిధులు దాచిపెడతారన్న ప్రచారం వుండేది. ఇందుకోసం అతను శివలింగాన్ని ముక్కలుగా పగులగొట్టాడు. ఆ ముక్కల్లో కొన్నింటిని నేటి ఆఫ్ఘనిస్తాన్‌లోని ఘజ్నావీలో ని ర్మించిన జామా మసీదుకు మెట్లుగా ఉపయోగించినట్లు చెబుతారు. మధ్యయుగాల చరిత్రలో ముస్లిం రాజులు జరిపిన విధ్వంసానికి విషాదపు గుర్తుగా మిగిలిన వాటిల్లో ప్రధానంగా చెప్పుకోవలసింది సోమనాథ క్షేత్రమే!
ఘజనీ దండయాత్ర సమయంలో ఇక్కడి పాలకుడు మొదటి చాళుక్య భీముడు. ఘజనీని ఎదిరించలేక పారిపోయి కంఠ్‌కోటలో ఆశ్రయం పొందుతాడు. మహమ్మద్‌ ఘజనీ ప్రధాన లక్ష్యం లూటీ మాత్రమే! రాజ్యస్థాపన కాదు! దీంతో అతగాడు వెళ్లిపోయిన తర్వాత చాళుక్య భీముడు తిరిగి వచ్చి రాజ్య పాలన చేపట్టినప్పటికీ, ధ్వంసమైన ఆలయాన్ని పునర్‌నిర్మించలేకపోతాడు. ఫలితంగాచాలాకాలం వరకు సోమనాథ ఆలయం శిథిలావస్థలోనే కొనసాగింది. తర్వాత రాజ్యాధికారాన్ని చేపట్టిన చాళుక్య రాజు కుమారపాల ఆలయ పునర్‌నిర్మాణానికి ఉపక్రమిస్తాడు. ఆయన ఆల యాన్ని అద్భుతమైన రీతిలో రత్నాలు తాపడం చేసిన రాతితో నిర్మించినట్టు క్రీ.శ.1169 నాటి శాసనం ద్వారా తెలుస్తోంది. మహమ్మద్‌ ఘజనీ ధ్వంసం చేసిన తర్వాత ఆలయం దాదాపు వందేళ్ల పాటు శిథిలావస్థలోనే కొనసాగిందనేది ఈ శాసనం ద్వారా తెలుస్తోంది. కుమారపాలుడు అంత కష్టపడి ఆలయం నిర్మించినప్పటికీ, తర్వాతి కాలంలో దీనిపై దాడులు ఆగలేదు. క్రీ.శ. 1299లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ, క్రీ.శ.1395లో ముజాఫర్‌ షా, క్రీ.శ.1665లో ఔరంగజేబ్‌లు ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారు.
విచిత్రమేమంటే దాడికి గురైన ప్రతిసారి ప్రజలు అత్యంత భక్తి ప్రపత్తులతో సోమనాథ ఆలయా న్ని పునర్‌నిర్మిస్తూ రావడం విశేషం. అయితే ఘజనీ దండయాత్ర తర్వాత ఆలయాన్ని ఘనమైన రీతిలో పునరుద్ధరించిన ఘనత కుమారపాలుడికే దక్కుతుంది. ఇన్ని విధ్వంసాలకు గురైనా శతాబ్దాల ఆధ్యాత్మిక, సాంస్కృతికకు ప్రతీకగా నిలిచిన ఈ దివ్యక్షేత్రం తన గుర్తింపును ఎప్పటికప్పుడు నిలుపుకుంటూ వస్తోంది. అయితే ఇంతటి చరిత్రలో చాలామందికి తెలియని విషయం ఒకటుంది. నాడు ఘజనీ ధ్వంసం చేసిన సోమనాథ శివలింగ భగ్నశకలాల్లో చాలా వాటిని అప్పటి హిందూ పండితులు రహస్యంగా తీసుకెళ్లి తమ ఇళ్లలో వుంచి భక్తి ప్రపత్తులతో పూజిస్తూ వస్తున్నారు. ఈ రహస్యం దాదాపు వెయ్యేళ్లుగా ఎవ్వరికీ తెలియకుండా, ఆయా కుంటుంబాల వారు, తమ కింది తరాలవారికి ఈ శివలింగ శకలాలను అప్పగిస్తూ వచ్చారు. దాదాపు వెయ్యేళ్ల తర్వాత ఆ పవిత్ర శకలాలు వెలుగులోకి రావడం విశేషం.
ఇన్ని సంవత్సరాలుగా ఈ పవిత్ర శివలింగ భగ్న శకలాలను భద్రపరుస్తూ వచ్చింది, అగ్నిహోత్రీయ బ్రాహ్మణులు. ఈ శకలాలను భక్తిప్రపత్తులతో ఇన్ని తరాలుగా పూజిస్తూ వస్తున్నారు. ఆవి ధంగా ఈ భగ్నశకలాలను భద్రపరచిన వారిలో సీతారామ శాస్త్రి ఒకరు. ఆయన అగ్నిహోత్రీ య బ్రాహ్మణ పండితుడు. ఇటీవల ఆయన ఈ భగ్నావశేషాలను ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీ రవి శంకర్‌కు అప్పగించారు. గత 21 ఏళ్లుగా ఈ అవశేషాలు శాస్త్రి సంరక్షణలో కొనసాగుతున్నాయి. ఇవి తన మామగారి వద్దనుంచి ఈయనకు అందాయి. ఆయన దాదాపు 60ఏళ్ల పాటు వీటికి భక్తిశ్రద్ధలతో పూజాదికాలు నిర్వహించారు. ప్రవీంద్ర సరస్వతిజీ అనే గురువు ఆయనకు ఈభగ్నశకలాలను అప్పగించారు.
నిజానికి 1924లో అప్పటి కంచికోటి పీఠాధిపతి పరమాచార్య వద్దకు ఈ భగ్నశకలాలను తీసుకెళ్లిన అగ్నిహోత్రి పండిత కుటుంబీకులు, వీటిని ఏం చేయాలంటూ ఆయన్ను ప్రార్థించారు. అ ప్పుడు ఆయన ఈ భగ్నశకలాల పవిత్రతను గుర్తించి, మరో వెయ్యి సంవత్సరాల వరకు వీటిని భద్రపరచండి. అప్పుడు సోమనాథ దేవాలయంలో వీటి ప్రతిష్ట జరుగుతుందని సెలవివ్వడంతో ఆ పండిత కుటుంబం వాటిని తమ ఇంటిలో భద్రంగా వుంచి పూజాదికాలు నిర్వహిస్తూ వచ్చా రు. తర్వాత సీతారామ శాస్త్రి మళ్లీ ఈ భగ్నశకలాలను కంచికోటి పరమాచార్య జగద్గురు శ్రీ జయేంద్రసరస్వతిశంకరాచార్య స్వాముల వారికి చూపించి పరిష్కారం కోరగా, అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాతనే వీటి ప్రతిష్ట జరుగుతుందని సెలవిచ్చారు. ఇది జరగక ముందే పరమాచార్య శివైక్యం చెందారు. దీంతో సీతారామశాస్త్రి వీటి భవితవ్యంపై మళ్లీ అయోమయంలో పడ్డారు. తర్వాత ప్రస్తుత శంకరాచార్య సలహామేరకు ఆయన శ్రీశ్రీ రవిశంకర్‌ను కలిసి పరిస్థితి వివరించడంతో, వీటిని సోమనాథ దేవా లయంలో ప్రతిష్టించడానికి హామీ ఇచ్చారు. దీంతో అమితానందం పొందిన శాస్త్రి, ‘నిజంగా నా జీవితం ధన్యమైంది. ఎట్టకేలకు ఈ భగ్నావశేషాలను సోమనాథ దేవాలయంలో ప్రతిష్టించాలన్న పెద్దల ఆకాంక్ష నెరవేరింది’ అన్నారు.
ఇప్పుడు సోమనాథ దివ్యక్షేత్రానికి చెందిన శివలింగ భగ్నావశేషాలను సోమనాథ దేవాలయంలో పున్ణప్రతిష్టించే బాధ్యతను ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ అధినేత శ్రీశ్రీ రవిశంకర్‌ స్వీకరించారు. వీటి ప్రశ స్త్యాన్ని వివరిస్తూ, ఇవి ఇప్పటికీ తమ అయస్కాంత శక్తిని ప్రదర్శిస్తూనే వున్నాయని, వీటి పవిత్రత లేశమాత్రం కూడా నష్టం కాలేదన్నారు. నిజానికి ఇది భారత చరిత్రలోని ఒక భాగాన్ని పున రుద్ధచించడం కాదు. భారతీయ ఆధ్యాత్మిక, నాగరికతలోని చైతన్య పునరుద్ధరణగా భావించాలి.
పురాతన గ్రంథాల ప్రకారం నిజమైన సోమనాథ శివలింగం మూడడుగుల ఎత్తుండేది. భూమిపై రెండడుగులు పైకిలేచి గాల్లో తేలియాడుతుండేది. అంటే భూమ్యాకర్షణ శక్తి దీనిపై పనిచేసేది కాదు. అప్పట్లో సోమనాథ దేవాలయం సంపదకు ప్రసిద్ధి. బంగారం, రత్నాల తాపడాలతో నిర్మి తమై ఆధ్యాత్మిక శోభను వెదజల్లేది. 1024లో ఘజనీ కేవలం దేవాలయంపై దాడికి మాత్రమే పాల్పడలేదు. హిందువుల సాంస్కృతిక, ఆధ్యాత్మిక గుర్తింపును ధ్వంసం చేయడానికి యత్నించా డు. ఈ దాడిలో గాల్లో తేలియాడే శివలింగాన్ని ముక్కలు చేయడమే కాదు, వేలాదిమంది హిందవులను ఊచకోత కోసి, ఆలయంలోని అపార సంపదను దోచుకెళ్లాడు.
ఎన్నిసార్లు పునరుద్ధరించినా వరుస దాడులకు గురవుతూ రావడం ఈ ఆలయ చరిత్ర! చివరకు 19వ శతాబ్దం వరకు ఇది శిథిలావస్థలోనే కొనసాగింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951లోనాటి ఉపప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేతృత్వంలో నేటి కొత్త దేవాలయం రూపుదిద్దుకుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version