భారత్ మాతాకీ జై అంటూ మసీదులో హోరెత్తిన నినాదాలు.

Mosque

పాకిస్తాన్ డౌన్ డౌన్
భారత్ మాతాకీ జై. అంటూ మసీదులో హోరెత్తిన నినాదాలు .

చిట్యాల నేటిధాత్రి :

జయశంకర్ చిట్యాల మండల కేంద్రంలోని కౌసర్ ఏమసీదులో జుమ్మా నమాజ్ తరువాత ముస్లిం సోదరులందరూ పాల్గొని మన పొరుగు దేశమైన పాకిస్తాన్ డౌన్ డౌన్ భారత్ మాతాకీ జై అనే నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా మండల కో ఆప్షన్ సభ్యులు మహమ్మద్ రాజ్ మహమ్మద్ మాట్లాడుతూ ఏప్రిల్ 22వ తేదీన పాకిస్తాన్ ఉగ్రవాదులు జమ్ము కాశ్మీర్ లోని పైల్గాం లో విహారయాత్రకు పోయిన అమాయకులైన 26 మందిని కాల్చి చంపడం జరిగింది దానికి ప్రతీకారంగా మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాల పైన మాత్రమేదాడి చేయడం జరిగింది కానీ వక్రబుద్ధి గల పాకిస్తాన్ భారతదేశం లోని సరిహద్దు ప్రాంతాల పైన అమాయక ప్రజల పైన దాడి చేస్తూ యుద్ధం చేస్తున్న ది ఈయుద్ధంలో మన భారత సైన్యానికి మనమందరం ఆత్మస్థైర్యాన్ని కలిగించి మన భారతదేశ ప్రభుత్వానికి అండగా నిలవాలని భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం పౌరుడు కూడా భారత్ మాతాకీ జై అంటూ నినాదం చేస్తూ మన దేశం పాకిస్తాన్ పై మరొక్కసారి గెలవాలని కోరుకుంటున్నాం అని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మసీదు కమిటీ అధ్యక్ష కార్యదర్శులు మొహమ్మద్ అజ్మత్ మియా హైదర్ పాషా మసీదు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!