*యాదగిరిగుట్టపైన దుకాణాల కోసం సంతకాల సేకరణ*
యాదగిరిగుట్ట నేటి ధాత్రి:
యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో కొండపైన ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న దుకాణాలను రద్దుచేసి కొత్తగా టెండర్లు వేయాలని పాత గుట్ట చౌరస్తా వద్ద తెలంగాణ టీ స్టాల్ ప్రరంగణంలో సంతకాల సేకరణ చేపట్టారు, సంతకాల సేకరణ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు స్థానికులు సంతకాలు చేశారు.

ఇట్టి కార్యక్రమం పెద్ద ఎత్తున యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. కొత్త టెండర్స్ వలన దేవస్థాన ఆదాయం గణనీయంగా పెరుగుతుందని యాదాద్రి పరిరక్షణ సమితి నాయకులు ఈ కార్యక్రమంలో తెలియజేశారు.
