Petition Submitted for Mallanna Temple Development
దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ వినతిపత్రం ఇచ్చిన సర్పంచి సరిత
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం మద్దులపల్లి గ్రామపంచాయతీ పరిధిలో గోదావరి తీరాన వెలసిన మల్లన్న దేవుని ఆలయానికి నిధులు మంజూరు చేసి ఆలయ నిర్మాణం చేపట్టాలని మద్దులపల్లి సర్పంచి సరిత, ఉపసర్పంచి లచ్చిరెడ్డి తెలంగాణ రాష్ట్ర దేవదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యారుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ సానుకూలంగా స్పందించి దేవాదాయశాఖ డిఈ రమేష్ కు ఆలయానికి సంబంధించిన వివరాలు చూడాలని ఆదేశించారు. సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు సర్పంచి సరిత తెలిపారు.
