Cooling Water Shelter Opened
గుడిబండ గ్రామంలో చలివేంద్రాన్ని ప్రారంభించిన. సర్పంచ్.
వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేలా.. చలివేంద్రం ఏర్పాటు.
బాటసారులకు సేద తీరే అవకాశం సర్పంచ్ మందుల నాగయ్య.
కోదాడ, నేటి ధాత్రి:
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు శుక్రవారం కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో సర్పంచ్ మందుల నాగయ్య చొరవ చూపి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రత వల్ల ప్రజలు పనుల నిమిత్తం బయటకు వచ్చినప్పుడు దాహంతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం లో (డి ఎల్ పిఓ) డివిజనల్ పంచాయతీ అధికారి, ఎంపీ ఓ, గ్రామ ఉప సర్పంచ్ ఇర్ల జయసింహా రెడ్డి, సెక్రటరీ, వార్డు మెంబర్లు సిబ్బంది తదితరులు పెద్దలు పాల్గొన్నారు.
