ముప్పనపల్లి దర్గా ఉరుసు ఉత్సవాలకు రోడ్డు మరమ్మతులు
ఏటూరునాగారం, నేటిధాత్రి
కన్నాయిగూడెం మండలం, మొప్పనపల్లి గ్రామంలో నిర్వహించనున్న పవిత్ర దర్గా ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని గ్రామంలో రాకపోకలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు మరమ్మతులు చేపట్టడం జరిగింది.
ఈ కార్యక్రమం ముప్పనపల్లి గ్రామ ఉప సర్పంచ్ గౌరవనీయులు చిదరి సుమన్ గారి సహకారంతో విజయవంతంగా నిర్వహించబడింది. ఉరుసు ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో, వారి సౌకర్యార్థం ఈ రోడ్డు మరమ్మతులు ఎంతో ఉపయోగకరంగా నిలవనున్నాయి.
గ్రామాభివృద్ధి, ప్రజా సౌకర్యాల పట్ల నిరంతర శ్రద్ధ చూపుతున్న ఉప సర్పంచ్ చిదరి సుమన్ గారి సేవలను గ్రామస్తులు, దర్గా కమిటీ సభ్యులు అభినందించారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ప్రజాహిత కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ ఉరుసు ఉత్సవాలు శాంతియుతంగా, భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించబడాలని గ్రామ పెద్దలు, దర్గా కమిటీ సభ్యులు ఆకాంక్షించారు.
