ఇద్దరు ఐరన్ లెగ్గులే?
`ఆ రెండు జిల్లాల ఓటమి వాళ్ల వల్లనే!!
`రెండు జిల్లాల్లో తుడిచిపెట్టుకు పోవడానికి కారణం వాళ్లే?
`ఖమ్మం ఖాళీ కావడానికి పువ్వాడే!
`వరంగల్ ఓటమికి కారణం రాకేషే!
`పొంగులేటిని పట్టించుకోక చెడగొట్డింది పువ్వాడ.
`తమ్మలను పక్కనపెట్టి మొదటికే మోసం తెచ్చింది అజయే.
`వరంగల్ ఓటమి మొత్తం రాకేష్ వల్లనే!
`బీఆర్ఎస్ నేతలను తిట్టి పార్టీని పలున చేసింది రాకేషే!
`ఆ ఇద్దరి వల్ల కారుకు వచ్చిన పీడనే!
`ఆ ఇద్దరు చెదపట్టినట్లే పార్టీని చెరిపేశారు.
`ఖమ్మంలో కారు తలెత్తుకోకుండా పువ్వాడ చేశాడు.
`రాకేష్ నమ్మితే వరంగల్ కు ఓటమిని తెచ్చిపెట్టాడు.
`ఈ ఇద్దరు పార్టీని భ్రష్టు పట్టించారు.
`ఖమ్మం కారులో పువ్వాడ చెరి ఖాళీ చేశాడు.
-మంత్రి పదవిలో వుండి అందర్నీ పార్టీకి దూరం చేశాడు.
-ప్రత్యక్ష,పరోక్షంగా ఈ ఇద్దరు పార్టీని కోలుకోకుండా చేశారు.
-వరంగల్ లో తలెత్తుకోకుండా రాకేష్ చేశాడు.
-బీజేపీలో వుండి రాకేష్ బిఆర్ఎస్ మీద దుమ్మెత్తిపోశాడు.
-కారులో చేరి పొగబెట్టాడు.
-ఎన్నికల ముందు చేరి, చిల్లం చిల్లం చేశాడు.
-బీఆర్ఎస్ అగ్రనేతలు ఈ ఇద్దరినే నమ్మారు.
-నమ్మిన వాళ్లను ఈ ఇద్దరు నట్టెట ముంచారు.
-ఇప్పటికీ ఆ ఇద్దరికే అగ్రనేతలు ప్రాధాన్యతనిస్తున్నారు.
-ఆ ఇద్దరు వున్నంత కాలం పార్టీ కష్ట కాలం తప్పదు.
-రాకేష్ ఒంటెద్దు పోకడలు..పువ్వాడ పనికి రాని లెక్కలు.
-తలకిందులైన కారు అంచనాలు.
-ఇప్పటికీ మించిపోయింది లేదు.
-ఈ ఇద్దరినీ పక్కన పెడితే చాలు.
-కారు జోరందుకోవడానికి పెద్ద సమయం పట్టదు.
-ఈ ఇద్దరి వల్లనే బిఆర్ఎస్ కు ఉద్యమ కారులు దూరమౌతున్నారు.
-మాజీ ఎమ్మెల్యేలు మధనపడుతున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
రాజకీయాల్లో కొంత మందిని గోల్డెన్ హాండ్స్అంటారు. కొంత మందిని ఐరన్ లెగ్స్ అంటారు. గోల్డెన్ హాండ్స్ వల్ల పార్టీకి ఎంతో మేలు జరిగిందని చెప్పుకునే అవకాశముంటుంది. ఐరన్ లెగ్గుల వల్ల పార్టీకి ఇబ్బందులు తప్ప జరిగే మేలు ఏమీ వుండదు. ఐరన్ లెగ్గులుగా ముద్ర పడిన నాయకుల్లో చాలా వరకు వాళ్లు గెలిచినా, పార్టీ గెలవదు. వాళ్లతోపాటు పార్టీని నిండా ముంచేస్తారు. అలాంటి వారిని రాజకీయ పార్టీలే ఐరన్ లెగ్లంటూ ప్రచారం సాగిస్తుంటాయి. అలా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో, ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీలో ఇద్దరి పేర్లు చెప్పుకుంటున్నారు. ఆ ఇద్దరు ఐరన్ లెగ్లే కాదు, ఏకంగా రెండు ఉమ్మడి జిల్లాల్లో బిఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రత్యక్ష, ప్రరోక్ష కారణాలు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వాళ్లను బిఆర్ఎస్ నమ్మడమే పాపమైపోయిందని అంటున్నారు. వాళ్ల వల్ల పార్టీకి అణాపైస లాభం జరక్కపోగా, పెద్ద నష్టం మిగిల్చారన్న చర్చ సర్వత్రా జరగుతోంది. పార్టీలో ఆ ఇద్దరి మూలంగా జరిగిన నష్టం భర్తీ కావడానికి కూడా సమయం పట్టేలా వుందంటున్నారు. వారు పార్టీలో వుంటే నాయకులంతా ఒక్కతాటి మీద వుండలేకపోతున్నారు. వారి పెత్తనం సాగుతుంటే పార్టీల నాయకులు సహించలేకపోతున్నారు. ముందుగా ఖమ్మం జిల్లా విషయాన్ని చెప్పుకుంటే పువ్వాడ అజయ్ కుమార్ తెలంగాణ ఉద్యమకారుడు కాదు. తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిన నాయకుడు. పువ్వాడ నాగేశ్వరరావు మీద వున్న అభిమానంతో ఆయనను గెలిపించారు. ముందుగా పువ్వాడ కాంగ్రెస్లో చేరారు. అక్కడి నుంచి గెలిచారు. తర్వాత 2014ఎన్నికల్లో బిఆర్ఎస్ గెవడంతో బిఆర్ఎస్లోకి వచ్చారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటిఆర్కు సన్నిహితుడయ్యారు. కేటిఆర్ వల్ల జిల్లా రాజకీయాల్లో కీలకంగా మారుతూ వచ్చారు. 2018 ముందస్తు ఎన్నికల్లో ఖమ్మం నుంచి గెలిచి, మంత్రి అయ్యారు. 2014నుంచి ఉనికి కోసం తపత్రయ పడ్డ అజయ్కుమార్ 2018 తర్వాత పెత్తనం చేయడం మొదలు పెట్టారు. మంత్రిగా బాద్యతలు చేపట్టిన తర్వాత సీనియర్ నాయకులను పార్టీకి దూరం చేసే ఎత్తుగడలు చేస్తూ వచ్చారు. ఒంటెద్దు పోకడలతో ఇతర నాయకులను పట్టించుకోవడం మానేశారు. ఇతర నాయకుల నాయకత్వాలు ప్రశ్నార్ధకం చేశారు. ముఖ్యంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వాన్ని బలహీన పర్చుతూ వచ్చారు. ఆయనకు ప్రాదాన్యత లేకుండా చేయాలనుకున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు ఆయనను దూరం చేస్తూ వచ్చారు. నిజానికి తుమ్మల నాగేశ్వరావు ఒకప్పుడు కేసిఆర్కు మంచి మిత్రుడు. ఆ సాన్నిహిత్యంతోనే తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనను కేసిఆర్ పిలిచి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. ముందు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తర్వాత మంత్రిగా అవకాశం కల్పించారు. తెలంగాణ అభివృద్దిలో ఆయన అనుభవాన్ని వినియోగించుకోవాలని చూశారు. ఎందుకంటే ముందు నుంచి ఖమ్మం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో నడిపిని నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు. ఉమ్మడి రాష్ట్రంలో ఖమ్మం జిల్లా రాజకీయాలను ఆయన శాసించారు. సుదీర్ఘ కాలం పాటు తెలుగుదేశం పార్టీ అదికారంలో వున్నంత కాలం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఖమ్మం జిల్లా అభివృద్దికి బాటలు వేశారు. అలాంటి నాయకుడిని పువ్వాడ అజయ్ మంత్రి అయిన నుంచి పక్కన పెట్టడం మొదలు పెట్టారు. 2019 ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు ఓటమికి కారణమయ్యారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎందుకంటే పాలేరు ఉప ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిచిన తుమ్మల తర్వాత జరిగిన 2018 ముందస్తు ఎన్నికల్లో ఓటమి పాలు కావడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. తుమ్మల ఓటమికి కారణం పువ్వాడ అన్న విమర్శలు అప్పుడే వచ్చాయి. ఎందుకంటే తుమ్మల 2018 ఎన్నికల్లో గెలిస్తే తనకు ప్రాదాన్యత లభించదని పువ్వాడ ఎత్తులువేసినట్లు చెప్పుకుంటారు. ఇక మరో నాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి. ఆయన 2014 వరకు తెలంగాణ రాజకీయాలకు పరిచయం లేని నాయకుడు. కానీ ఉప్పొంగిన తరంగంలా తెలంగాణ వచ్చినతర్వాత కూడా ఆయన తెలంగాణలో వైసిపి తరుపున పోటీచేసి గెలిచారు. ఖమ్మం ఎంపిగా ఆయన గెలవడమే కాదు, ఓ ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా గెలిపించి, తెలంగాణ రాజకీయాలను తన వైపు తిప్పుకున్నారు. అందరూ ఆయన వైపు చూసేలా చేసుకున్నారు. ఖమ్మం జిల్లాను శాసించే కొత్త నాయకుడు వచ్చాడని అందరూ అప్పుడే అనుకున్నారు. అలాంటి సమయంలోనే కేసిఆర్ ఖమ్మం ఎంపిగా వున్న పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన సేవలు వినియోగించుకున్నారు. 2018 ఎన్నికల్లో ఆయనకు అవకాశమివ్వకపోయినా పార్టీ కోసం పనిచేశారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో కూడా టికెట్ ఇవ్వకపోయినా పార్టీ కోసం పనిచేస్తూనే వచ్చారు. అలాంటి నాయకుడిని పువ్వాడ అజయ్ పార్టీకి దూరం చేస్తూ వచ్చారు. పొంగులేటికి ప్రాదాన్యతనివ్వకుండా చూసుకున్నారు. కేసిఆర్ అప్పాయింటు మెంటు కూడా మంత్రి పొంగులేటికి అందకుండా చేశారు. జిల్లారాజకీయాల నుంచి పొంగులేటిని తరిమేయాలని పువ్వాడ చూశారు. కాని ఏమైంది. పువ్వాడ ఓడిపోయారు. కాంగ్రెస్లో చేరిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బిఆర్ఎస్ మీద సవాలు చేశారు. బిఆర్ఎస్ను ఖమ్మం నుంచి అసెంబ్లీ గేటు తాకుండా చేస్తానన్నారు. అన్నట్లుగానే కాంగ్రెస్ను గెలిపించారు. ఖమ్మంలో క్లీన్ స్వీప్ చేసి చూపించారు. తన రాజకీయ శక్తి ఎంత గొప్పదో రుచి చూపించారు. తను కూడా గెలవలేని పువ్వాడను నమ్ముకొని, ఆయన మాటలు పట్టుకొని పొంగులేటి శ్రీనివాస్ను దూరం చేసుకొని పార్టీ ఓటమి పాలైంది. అదే శ్రీనివాస్రెడ్డికి బిఆర్ఎస్లో ప్రాధాన్యత వుంటే బిఆర్ఎస్ రాజకీయం మరో విధంగా వుండేది. పువ్వాడ తన స్వార్ధ రాజకీయం కోసం పార్టీని నట్టెట ముంచేశారు. ఇప్పుడు కూడా ఆయన వ్యవహారం మారలేదు. ఆయన తీరు ఏ మాత్రం మారలేదనే వ్యాఖ్యలే స్వర్వత్రా వినిపిస్తున్నాయి. పార్టీ కోసం ఆయన చేస్తున్నదేమీ లేదు. ముందు పడతున్నదేమీ లేదు. ఇటీవల జరిగిన పార్టీ రజతోత్సవ సభకు ఇతర నాయకులు తరలించినంత మందిని కూడా పువ్వాడ తలరించలేదని అంటున్నారు. అందువల్ల ఖమ్మం కారు రాజకీయాల నుంచి పువ్వాడను పక్కకు తప్పిస్తే తప్ప ఖమ్మంలో మళ్లీ గులాబీ వికసించదంటున్నారు. బిఆర్ఎస్కు పూర్వ వైభవం రాదంటున్నారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా అంటేనే బిఆర్ఎస్కు కంచుకోట. ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో బిఆర్ఎస్ నాయకులున్నంత బలంగా ఏ పార్టీ లేదు. ఏ పార్టీకి అంత బలవంతమైన నాయకులు లేరు. కాని ఒక్క నాయకుడు మూలంగా వరంగల్ బిఆర్ఎస్ రాజకీయాలు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్న మాటలు పార్టీ పెద్దల దాకా చేరడం లేదు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో నాయకులు, ఉద్యమ కారులు ఎక్కువ మంది బిఆర్ఎస్లోనే వున్నారు. ఉద్యమ కాలం నుంచి బిఆర్ఎస్ పార్టీకోసం పనిచేస్తూనే వున్నారు. పార్టీకి కంచుకోటలు కట్టిన నాయకులున్నారు. అలాంటి పార్టీని చిన్నా భిన్నం చేసిన నాయకుడు రాకేశ్రెడ్డిని బిఆర్ఎస్లోకి తీసుకోవడమే పెద్ద పొరపాటు అంటున్నారు. ఇది బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తీసుకున్న సరైన నిర్ణయం కాదంటున్నారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి, బిఆర్ఎస్కు తీరని అన్యాయంచేసిన రాకేష్రెడ్డికి ప్రాదాన్యత కల్పించడం మంచిది కాదంటున్నారు. ఎందుకంటే బిజేపిలో టికెట్ దక్కే అవకాశం లేదని నిర్ధారణ జరిగిన తర్వాత రాకేశ్రెడ్డి బిఆర్ఎస్లో చేరారు. అంతకు ముందు మూడేళ్ల కాలం పాటు రాకేష్రెడ్డి తన సోషల్ మీడియా, బిజేపిని అడ్డం పెట్టుకొని బిఆర్ఎస్ మీద తీవ్ర విమర్శలు చేసేవారు. కేంద్రంలో అధికారంలో వున్న బిజేపి అండదండలతో బిఆర్ఎస్ మీద లేని పోని అబద్దాలు సృష్టించి ప్రచారం చేసేవారు. ఏకంగా పోలీసు శాఖను కూడా పదే పదే అవమానించే రీతిలో మీడియా సమావేశాలు ఏర్పాటుచేస్తుండేవారు. ఇక ఉమ్మడి వరంగల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఆయన చేసిన అబద్దపు ప్రచారాలను ప్రజలు నమ్మారు. ఎంతో నిజాయితీగా పనిచేసిన ఎమ్మెల్యేలు వున్నారు. అలాంటి మాజీ ఎమ్మెల్యేల మీద కూడా లేనిపోనివి ప్రచారం చేసి, ప్రజల దృష్టిని మరల్చాడు. అంతిమంతా అది కాంగ్రెస్కు కలిసొచ్చేలా చేశారు. తీరా ఎన్నికల ముందు రాకేష్రెడ్డి బిఆర్ఎస్లో చేర్చుకోవడం వల్ల ఆయన మరింత నష్టమే జరిగింది తప్ప, మేలు జరగలేదు. వ్యక్తిగతంగా ఆయన కొంత మంది ఎమ్మెల్యేలపై చేసిన ఆరోపణలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. తాను బిజేపిలో వున్నప్పుడు చేసిన ఆరోపణలు నిజం కాదని చెప్పలేకపోయారు. వరంగల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేల గెలుపుకోసం పెద్దగా కష్టపడిరది లేదు. కాని ఆయనను తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడంతో బిఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమైంది. ఎమ్మెల్సీగా వున్న పల్లా రాజేశ్వరరెడ్డి జనగామ ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంతో ఉప ఎన్నిక వచ్చింది.. ఆ టికెట్ ఉద్యమ కారులకు ఇస్తారని అనుకున్నారు. కాని రాకేష్రెడ్డికి ఇస్తారని ఎవరూ ఊహించలేదు. ఆఖరు నిమిషంలో ఆయన పేరు ఖరారు చేయడంతో అందరూ అవాక్కయ్యారు. పైగా రాకేష్రెడ్డికి టికెట్ ఇవ్వడమే కాకుండా, ఎన్నికల ఖర్చు కూడా మొత్తం బిఆర్ఎస్ పార్టీయే భరించింది. అదే టికెట్, ఖర్చు ఇతర ఉద్యమ నాయకులకు ఎవరికి ఇచ్చినా బిఆర్ఎస్ గెలిచేది. రాకేశ్రెడ్డి బిజేపిలో వున్నంత కాలం బిఆర్ఎస్కు మద్దతుగా వున్న పత్రికలపై కూడా నిత్యం విషం కక్కుతూ వుండేవారు. నమస్తే తెలంగాణ వంటి పత్రికను కూడా తర్పూర పడుతుండేవారు. ఇప్పుడు అలాంటి రాకేష్రెడ్డికి ఆ పత్రికలోనే అధిక ప్రాదాన్యతన్విడంపై బిఆర్ఎస్ శ్రేణుల్లో అసహనం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన బిఆర్ఎస్ రజతోత్సవాలను పురస్కరించుకొని జరిగిన సభ ఏర్పాటు, నిర్వహణ, బాధ్యతలు రాకేష్రెడ్డి తీసుకోలేదు. దాని పర్యవేక్షణ సైతం కనీసం చేయలేదు. రజతోత్సవసభ వేదిక మీద నిర్వాహకుల కన్నా, ఎక్కువ హల్చల్చేశారు. ఇది నిజమైన ఉద్యమకారులకు ఎంతో ఇబ్బందికరంగా కనిపించింది. ఎందుకంటే రాకేష్రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు కాదు. కనీసం ఆది నుంచి బిఆర్ఎస్ నాయకడు కాదు. మద్దతు దారుడు అసలే కాదు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసిఆర్ను గుర్తించిన వ్యక్తి కాదు. కేసిఆర్ త్యాగాన్ని ఏనాడు కొనియాడిన నాయకుడు కాదు. తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తుంటే కళ్లు చూసిన నాయకుడు కాదు. కాని తెలంగాణను కేసిఆర్ ఆగం చేస్తున్నాడని విమర్శించిన నాయకుడు రాకేష్రెడ్డి. తెలంగాణను కేసిఆర్ అప్పుల పాలు చేస్తున్నాడన్నారు. కాలేశ్వరం విషయంలో రాకేష్రెడ్డి చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. వరంగల్ జిల్లాకు చెందిన బిఆర్ఎస్ సీనియర్ నాయకులపై రాకేష్రెడ్డి అబద్దాలు చెప్పి, చెప్పి వారి ఓటమికి కారణకుడయ్యారు. అలాంటి రాకేష్రెడ్డిని తెచ్చి ఆ నాయకుల నెత్తి మీద పెట్టేంత పనిచేయడం సరైంది కాదంటున్నారు. రాకేష్ పార్టీలో వున్నా, లాభం లేదని అంటున్నారు. అలాంటి నాయకుడు వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదంటున్నారు