కాల్పుల విరమణపై డోనాల్డ్ ట్రంప్ పోస్ట్
ఇప్పటికే పాక్ను అథ్ణపాతాళానికి తొక్కేసిన ఇండియా
గతకాలం నాటి భారత్ కాదు
కర్ర పట్టుకో, శాంతంగా మాట్లాడు అన్నదే మన విధానం
బలం లేనివాడు శాంతివచనాలు పలికితే ఎవరూ లెక్కచేయరు
సత్తా వున్నవాడు చెప్పే ప్రతిమాట శాసనమే
శాసించే స్థాయికి చేరిన భారత్
భారత దౌత్య నిపుణత, సైనిక సామర్థ్యానికి గుర్తింపు
చైనా, పాక్లకు తమ స్థాయి ఏంటో తెలియజెప్పిన భారత్
భారత్ాపాకిస్తాన్లు కాల్పుల విరమణ పాటించడానికి అంగీకరించాయని శనివారం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పోస్ట్ చేయడం సంచలనం సృష్టించింది. అయితే వీసా, సింధూ నదీ జలాలపై భారత్ వైఖరి కొనసాగుతుందనేది ఈ పోస్ట్ సారాంశం. పహల్గాం సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం, పాక్లోని ఉగ్రస్థావరాలపై దాడులు జరపడం, తర్వాత పాకిస్తాన్ మనదేశంపై యుద్ధం ప్రారంభించడం తెలిసిందే. ఉగ్రవాద స్థావరాలపై జరిగిన దాడులకు మనదేశం ‘ఆపరేషన్ సింధూర్’ అని పేరు పెడితే పాకిస్తాన్ మనదేశంపై జరి పే దాడులకు ‘‘‘ఆపరేషన్ బున్యాన్ ఉన్ మర్సూస్’ అని పేరుపెట్టింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ మనకు ఎంతమాత్రం సరిసాటి కాదన్న సంగతి ప్రపంచానికి స్పష్టమైంది. అంతేకాదు, మన సాయుధ సంపత్తి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లను, క్షిపణులను, విమానాలను నిలువరించే పటిష్ట రక్షణ వ్యవస్థ, నిర్వహించిన ప్రతి దాడిలో నూటికి నూరుపాళ్లు కచ్చితత్వాన్ని సాధించడం, మరోవైపు పాకిస్తాన్ను ఏకాకిని చేసేవిధంగా మనం అనుసరించిన దౌత్యనీతి ప్రపంచ దేశాలను నోరెళ్లబెట్టేలా చేసింది. ఒక చెడు మరో మంచికి దారితీస్తుందనేది ఒక సామెత. పాక్ చేసిన దుశ్చర్య ఇప్పుడు దానికి తన స్థానమేంటో చక్కగా తెలిసొచ్చింది. రెండోది భారత్ పదేళ్ల క్రితం కంటే అన్నిరంగాల్లో సాధించిన ప్రగతి, సామర్థ్యాలను ప్రపంచం అబ్బురంతో చూస్తోంది. ఇప్పటి కే ప్రపంచ యవనికపై దౌత్యపరంగా ఒక విలక్షణ శైలిని అనుసరిస్తూ, అవసర సమయంలో అగ్రరాజ్యాలతో సహా అన్ని దేశాలు తనవైపే చూసే స్థాయికి భారత్ చేరింది.
ఈ యుద్ధం చైనాకు కూడా పెద్ద గుణపాఠం నేర్పుతుందనుకోవాలి. ప్రపంచంలోనే తమవి అ త్యాధునిక రక్షణ వ్యవస్థలుగా చైనా విపరీత ప్రచారం చేసుకుంది. ఎఫ్`16 విమానాలకు దీటు గా వుంటాయంటూ జెఎఫ్`17 విమానాల గురించి ఎంతో గొప్పలు చెప్పుకోవడమే కాదు, తన ఐరన్ బ్రదర్ పాకిస్తాన్కు అందజేసింది. చైనా రక్షణ వ్యవస్థలు, జెఎఫ్`17 యుద్ధ విమానాలు ఏవీ మన ధాటికి తట్టుకోలేక ధ్వంసమైపోయాయి. అంతెందుకు, ఎఫ్`16 యుద్ధ విమానాలను కూడా మన సైన్యం కూల్చివేసింది. ప్రపంచ మార్కెట్లో ఎఫ్`16 విమానాలను అమ్ముకోవడానికి అమెరికాకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిరది. అమెరికా పరిస్థితిని అర్థం చేసుకొని మనం ఆవిషయాన్ని ప్రత్యక్షంగా చెప్పకపోయినా, సోషల్ మీడియాలో వైరల్ కావడం ఆ దేశాన్ని ఇరుకున పడేసింది. కేవలం ఉగ్రవాదులపై దాడులకు మాత్రమే వినియోగించాలన్న నిబంధనను ఉల్లం ఘించినందుకు ఇప్పుడు పాకిస్తాన్కు, అమెరికా చీవాట్లు పెట్టే పరిస్థితి ఎదురైంది. దీనికి తోడు చైనా రక్షణరంగ ఉత్పత్తుల్లోని డొల్లతనాన్ని భారత్ ప్రపంచానికి వెల్లడిరచినట్లయింది. కేవలం కొద్ది సమయంలోనే పాకిస్తాన్లోని చైనా తయారీ రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడమే కాదు, జెఎఫ్`17 యుద్ధ విమానాలను సునాయాసంగా కూల్చివేయడంతో భారత్ సత్తా ఏంటో చైనాకు తెలిసొచ్చింది. అంతేకాదు తైవాన్ ఆక్రమణకు చైనా చేస్తున్న యత్నాలను చూసి మరే దేశమూ ఇప్పుడు భయపడక పోవచ్చు. ముఖ్యంగా ఆ దేశానికి తన చుట్టూ 14 చిన్న దేశాలతో ఘర్షణ వాతావరణం నెలకొన్న తరుణంలో చైనా ఉత్పత్తుల డొల్లతనం అర్థమైన ఈ దేశాలేవీ ఇక చైనాను లెక్కచేయకపోవచ్చు. అమెరికా కూడా చైనా సాయుధ సంపత్తిపై ఒక అంచనాకు వచ్చి వుండాలి. ఇదే సమయంలో ఎఫ్`16 యుద్ధ విమానాలను కూల్చివేసిన భారత్ సామర్థ్యం కూడా అమెరికాకు తెలిసొచ్చింటుంది.
2013ా14 నుంచి 2024ా25 వరకు పరిశీలిస్తే భారత్ ఎంతటి సామర్థ్యాన్ని సంతరించుకున్నదీ ఈ యుద్ధం స్పష్టం చేసింది. టర్కీ వేల సంఖ్యలో డ్రోన్లను పాకిస్తాన్కు ఇచ్చినప్పటికీ, భారత్ వాటిని సమర్థవంతంగా కూల్చివేయడంతో డ్రోన్ల తయారీలో తానే రారాజునని భావిస్తున్న టర్కీకి శృంగభంగమైంది. భారత్ శక్తి ఎంటో బాగా తెలిసొచ్చింది. ఇప్పుడు ఏజియన్ సముద్రంలోని ద్వీపాల విషయంలో గ్రీస్తో టర్కీకి గొడవులున్నాయి. అదేవిధంగా సైప్రస్ విషయంలో కూడా రెండు దేశాల మధ్య ఘర్షణ వాతావరణం వుంది. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్కు మద్దతుగా టర్కీ నిలవడంతో మనదేశానికి తీవ్ర ఆగ్రహం కలిగింది. పలితంగా ఇప్పుడు మనం గ్రీస్కు మద్దతుగా నిలుస్తున్నాం. అదేవిధంగా పాకిస్తాన్కు మద్దతుగా నిలిచిన మరోదేశం అజర్బైజాన్. ఇప్పుడు ఆ దేశానికి కూడా భారత్ శక్తి ఏంటో తెలిసొచ్చింది. దానికి అర్మీనియాకు మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి! అజర్బైజాన్ కూడా కశ్మీర్ విషయంలో పాక్ పక్షమే వహిస్తోంది. ఇప్పుడు మనదేశం అర్మీనియాకు ఆయుధ సంపత్తిని సమకూరుస్తూ, అజర్బైజాన్కు చెక్పెట్టే రీతిలో వ్యవహరిస్తున్నాం. ఇదిలావుండగా అజర్బైజాన్ాఅర్మీనియా యుద్ధం డ్రోన్ల వాడకం ప్రాధాన్యత ను ప్రపంచానికి తెలియజెప్పగా, భారత్ాపాకిస్తాన్ల మధ్య యుద్ధం ‘కౌంటర్ డ్రోన్’ టెక్నాలజీ అవసరాన్ని ప్రపంచానికి వెల్లడిరచింది.
ఈ యుద్ధంలో పాకిస్తాన్ మొత్తం 26 ప్రదేశాలనుంచి ముఖ్యంగా మనదేశ పశ్చిమ ప్రాంతంపై డ్రోన్లు, సుదూర ప్రాంతాలపై దాడులకు ఉపయోగించే క్షిపణుల సహాయంతో దాడులకు యత్నించగా మన రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొనడమే కాదు, త్రివిధ దళాలు సమన్వయంతో పనిచేసి పాకిస్తాన్కు చుక్కలు చూపించాయి. మన నేవీ కరాచీ పోర్టులో సృష్టించిన విధ్వంసానికిఅది ఇప్పట్లో మామూలు స్థితికి రాదనేది సుస్పష్టం. లాహోర్, రావల్పిండి తదితర ప్రాంతాలపై మనదేశం చేసిన దాడులు, పాకిస్తాన్కు భవిష్యత్తులో మరచిపోలేని గుర్తులుగా మిగిలిపోతాయనడంలో ఎంతమాత్రం సందేహం లేదు.
నిజం చెప్పాలంటే పహల్గామ్లో అమాయక పర్యాటకులను పొట్టనపెట్టుకున్న పాక్ ఉగ్రవాదుల కు వ్యతిరేకంగా భారత్ తన చర్యను ప్రారంభించింది. వీరిమూలాలను ధ్వంసం చేయాలన్న నిర్ణయానికి వచ్చి అటువంటి పాక్లోని 42 ఉగ్రస్థావరాలను గుర్తించింది. వీటిల్లో మొదటిదశలో 9స్థావరాలపై జరిపిన దాడుల కలిగిన విధ్వంసం పాక్ కలలో కూడా ఊహించి వుండదు. అంతే కాదు యూద`అమెరికన్ జాతీయుడైన జర్నలిస్ట్ డేనియన్ పెరెల్ హత్యలో పరోక్ష పాత్ర పోషించిన ఇస్లామిక్ ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజర్ ఆపరేషన్ సిందూర్లో హతమయ్యాడు. ఇతగాడిని అప్పగించాలన్ని ఎప్పటినుంచో అమెరికా కోరుతున్నా పాకిస్తాన్ ఆపనిచేయడంలేదు. ఇతడి మరణం విషయం భారత్ ప్రకటించిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేయడం గమనార్హం. ఇదిలావుండగా ఉగ్ర స్థావరాలపై దాడిని తనపై చేసిందిగా పరిగణించి మనదేశంపై ప్రతిచర్యకు దిగిన పాకిస్తాన్కు అడుగడుగునా శృంగభంగమే మిగిలింది. తమదేశంలో అంతర్గత కల్లోలాలను తట్టుకోవడానికి భారత్పై యుద్ధం చేయకతప్పదని భావించిన పాక్ మనదేశం పై కాలు దువ్వింది. చివరకు భంగపడి ఏదోవిధంగా ఈ యుద్ధాన్ని ఆపాలంటూ అమెరికా కా ళ్లు పట్టుకోవాల్సి వచ్చింది. బహుశా తెరవెనుక దౌత్యం నేపథ్యం కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయంటూ ట్రంప్ ట్వీట్ చేయడానికి దారితీసుండవచ్చు.
ఒకవేళ ఇదే నిజమై కాల్పుల విరమణ పాటిస్తే మొత్తం గుర్తించిన 42 ఉగ్రస్థావరాలను ధ్వంసం చేయాలన్న భారత్ లక్ష్యం మధ్యలోనే ఆగిపోతుంది. ఈ యుద్ధం ద్వారా పీఓజేకేను స్వాధీనం చేసుకునే సువర్ణావకాశం కూడా చేజారిపోతుంది. ఇక బెలూచ్ వీరులు ఇప్పటికే 80శాతం బెలూచ్ ప్రాంతాన్ని ఆక్రమించుకొని స్వాతంత్య్రం ప్రకటించుకునే అవకాశం కూడా దెబ్బతింటుంది. వాస్తవానికి బెలూచ్ వీరులకు అమెరికా పరోక్ష మద్దతుందన్న నిర్ధారణ కాని వార్తలు వచ్చాయి కూడా! లక్ష్యం సాధించకుండా వెనుదిరగని నరేంద్ర మోదీ ట్రంప్ ట్వీట్పై ఏవిధంగా స్పందిస్తా రో చూడాలి. గతంలో జరిగిన యుద్ధాల్లో కూడా మనదేశం అన్ని సానుకూలతలున్నా, పాకిస్తాన్ను క్షమించే రీతిలోనే వ్యవహరించింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుందా? అనేది ప్రశ్న.
మరో అంశమేంటంటే, ఉగ్రవాదులపైనే దాడులు జరపాలి, యుద్ధం అనవసరం, ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారంటూ మనదేశంలోనే కొందరు వ్యాఖ్యానించే ప్రబుద్ధులున్నారు. కానీ అసలు సమస్య ఎక్కడినుంచి ప్రారంభమైంది? పహల్గాం దాడినుంచి! ఇక్కడ చనిపోయింది అమాయకు లైన సాధారణ పర్యాటకులు! దీనికి ప్రతీకారంగా భారత్ మొదలు పెట్టింది కేవలం ఉగ్రవాద స్థావరాలపై దాడులతోనే! మనదేశం చేసిన దాడుల లక్ష్యం సాధారణ పౌరులు లేదా పాక్ సైనిక స్థావరాలు కానేకాదు. ఐక్యరాజ్య సమితి ఉగ్రవాదులుగా ప్రకటించిన వారి మూలాలపై దాడు లు జరిపింది. మరి యుద్ధం మొదలుపెట్టిందెవరు? పాకిస్తాన్! మరి మన కుహనా మేధావులకు కంటి ఎదురుగ్గా కనిపిస్తున్న ఈ సత్యం అర్థం కావడంలేదంటే ఆ విచక్షణను వారికే ఒదిలే యాలి. ఒక రకంగా చెప్పాలంటే మనదేశాన్ని కొన్ని రకలు ‘ఇజాలు’ క్యాన్సర్లా పట్టిపీడిస్తున్నాయి. ఇవి ఏ స్థాయికి చేరుకున్నాయంటే ‘ఛాందస స్థాయికి’ చేరుకున్నాయి. అందువల్లనే వీటిని ‘సూ డో లిబరలిజం’ లేదా ‘లిబరల్ ఫండమెంటలిజం’ అనడం సబబుగా వుంటుందేమో! భారత్`పాక్ మధ్య సంఘర్షణను రెండు కులీన వర్గాలకు చెందిన ప్రభుత్వాలు చేస్తున్న యుద్ధంగా వర్ణించే వారు, పదగుంభనం బాగున్నా, అర్థం తేలిపోతున్నది. తప్పు చేసినవాడిని శిక్షించాల్సిందే! అది ప్రకృతి ధర్మం! చిన్న పిల్లవాడు అమాయకుడు కదాని నిప్పులో వేలు పెడితే కాలకుండా వుండదు! ప్రతి తప్పుడు పనికి కాలం విధించే శిక్ష కఠినంగానే వుంటుంది! సమాజంలో ధనికులు, పేదలు, ఉపాధి లేనివారు, అనాధలు…ఈవిధంగా అన్ని రకాల మనుషులు వుంటారు. వీరి అభ్యున్నతికి ఒక్కో ప్రభుత్వం ఒక్కో విధానాన్ని అనుసరిస్తుంది. కానీ ఏ ప్రభుత్వం వీటిని సమూలంగా తొలగించడం సాధ్యంకాదు. అట్లాగని వీరిని ఉపేక్షించనూ కూడదు. ప్రతి సంఘటనకు ‘వీరిని’ ముందుకు తీసుకొచ్చి పదగుంభనంతో మాట్లాడటం ‘డొల్ల మేధావితనం’ తప్ప ‘ఉపయుక్త మేధస్సు’ కాదు!