పాక్ యుద్ధంతో మన సాంకేతిక సామర్థ్యం ప్రపంచానికి వెల్లడి
పాక్ మనపై చేసిన అన్ని దాడులు విఫలం

మన నేవీ దాడిలో కరాచీ పోర్టు ధ్వంసం
లాహోర్, రావల్పిండి ప్రాంతాల్లో భయోత్పాతం సృష్టించిన మన దాడులు

పాక్ ప్రధాని ఇంటి సమీపంలో పేలుడు…సమీప బంకర్కు తరలింపు
మరోపక్క విముక్తి దిశగా బెలూచిస్తాన్
పాక్ సైన్యానికి చుక్కలు చూపిస్తున్న బెలూచ్ వీరులు
హైదరబాద్,నేటిధాత్రి:
పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత్ జరిపిన దాడులకు ప్రతీకారంగా 8వ తేదీ రాత్రి నుంచి 9వ తేదీ తెల్లవారుజాము వరకు పాకిస్తాన్ మన సైనిక స్థావరాలపై జరిపిన దాడిలో టర్కీ తయారీ ‘సోంగర్’ డ్రోన్లను ఉపయోగించినట్లు వార్తలు వచ్చాయి. వీటి సంఖ్య 300`400 వరకు ఉండవచ్చునని అంచనా. ముఖ్యంగా ఈ దాడులు దేశంలోని ఉత్తర, పశ్చిమ ప్రాంతాలపై జరగడం గమనార్హం. జమ్ము కశ్మీర్లోని శ్రీనగర్ నుంచి రాజస్తాన్ లోని జైసల్మేర్ వరకు ఈ దాడులు కొనసాగాయి. ఇవి లద్దాఖ్లోని సియాచిన్ గ్లేసియర్ వద్ద వు న్న బేస్ క్యాంప్నుంచి చూస్తే పాకిస్తాన్ చేసిన దాడులు చాలా విస్తృత పరిధిలో కొనసాగినట్టు అర్థమవుతుంది. అంటే కశ్మీర్ నుంచి గుజరాత్ వరకు 1400 కిలోమీటర్ల దూరం వరకు పాకిస్తాన్ ఈ దాడులు కొనసాగించింది. విచిత్రంగా గుమనించాల్సిన విషయమేంటంటే, వీటిల్లో చాలా డ్రోన్లను నిఖా కోసం, మన సైనిక, వైమానిక స్థావరాల ప్రదేశాలను కచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగించగా, మరికొన్ని ఆయుధాలు అమర్చినవి వున్నాయి. విశేషమేంటంటే మన సైన్యం వీటని గుర్తించడమే కాదు, తక్షణమే వీటన్నింటిని ధ్వంసం చేయడం విశేషం.
ఈ సందర్భంగా అర్మీనియా`అజర్బైజాన్ యుద్ధాన్ని గుర్తుకు తెచ్చుకోవాలి. ఇదే టర్కీ అందజేసిన డ్రోన్లతో అజర్బైజాన్ దాడులు చేయడంతో అర్మీనియా సైన్యం, ట్యాంకులు, రక్షణ వ్యవస్థ మొత్తం కుప్పకూలిపోవడంతో పూర్తిగా ఓడిపోయింది. ఈ యుద్ధాన్ని నిశితంగా గమనించిన ప్రపంచ దేశాల యుద్ధ నిపుణులు అప్పటివరకు అనుసరిస్తున్న యుద్ధ తంత్రాన్ని సమూలంగా మార్చుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. అదీకాకుండా యుద్ధాలు సంప్రదాయ రీతినుంచి పూర్తిగా సాంకేతికతపై ఆధారపడే దశకు చేరుకోవాల్సిన అవసరాన్ని కూడా ఈ యుద్ధం తెలియజెప్పింది. అంటే అప్పటికే అందుబాటులో ఉన్న సాంకేతితను మరింత ఆధునిక దశకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వెల్లడిరచింది. దీంతో అప్పటివరకు రక్షణ రంగంలో డ్రోన్ల వినియోగం విషయంపై పెద్దగా దృష్టి సారించని దేశాలు ఒక్కసారిగా వీటిపైవు మళ్లాయి. డ్రోన్ల వినియోగం వల్ల యుద్ధం ఖర్చు గణనీయంగా తగ్గడమే కాకుండా శత్రువుకు తీవ్రస్థాయిలో నష్టాన్ని కలిగించవచ్చునన్నది స్పష్టం కావడంతో, ఈ రంగంలో మరిన్ని పరిశోధనలు జరిగాయి, జరుగుతున్నాయి. మనదేశం కూడా డ్రోన్ల సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా పెంచుకోవడానికి కృషి చేసిన ఫలితం నేటి యు ద్ధంలో ఎంతగానో ఉపయోగపడిరది. డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు యాంటీ డ్రోన్ టెక్నా లజీ కూడా బాగా అభివృద్ధి చెందడం గమనార్హం. మనదేశం ఈ రంగంలో ఎంతగా అభివృద్ధి సాధించిందో తెలియనివారికి ఈ యుద్ధం మన సాంకేతిక పరిజ్ఞాన స్థాయి, సామర్థ్యం బాగా తలిసొచ్చింటాయి. క్షిపణులు, విమానాల దాడులనుంచి రక్షణ కల్పించే వ్యవస్థ విషయంలో ఇజ్రాయిల్కు చెందిన ఐరన్ డోమ్ ఇప్పటివరకు ప్రపంచంలో అత్యాధునికమైనదిగా పరిగణించడబడు తోంది. అయితే మనదేశం ఈ విషయంలో రష్యా, ఇజ్రాయిల్ సాంకేతిక పరిజ్ఞానంతో పాటు దేశీయంగా అభివృద్ధి చేసిన రక్షణ వ్యవస్థలు మనకు కంచుకోటలా నిలిచి, పాకిస్తాన్ దాడుల నుంచి రక్షణ కల్పించాయనే చెప్పాలి. ఏతావాతా చెప్పొచ్చేదేమంటే మన సాంకేతిక పరిజ్ఞానం ఎంత ఆధునికంగా, ఎంత ప్రభావశీలకంగా వున్నదీ ప్రపంచ దేశాలకు బాగా అర్థమైంది. ఇప్పుడు మనం శత్రుదాడులనుంచి రక్షణ పొందడమే కాదు, పాక్లోని రక్షణ వ్యవస్థలను తుత్తినియ లు చేయగలగడం మరో విశేషం. లాహోర్, రావల్పిండి వంటి ప్రాంతాల్లో చైనా తయారీ పాక్ రక్షణ వ్యవస్థలను మన డ్రోన్లు లేదా విమానాలు పూర్తిగా ధ్వంసం చేయగలిగాయి.
మనం దేశీయ, విదేశీయ సాంకేతిక పరిజ్ఞానాలతో ఏర్పరచుకున్న రక్షణ వ్యవస్థ శత్రు దాడుల నుంచి కాపాడిరదనేది స్పష్టమైంది. ఈ విషయంలో మనం వివిధ అంచెల్లో రక్షణ వ్యవస్థను ఏ ర్పరచుకున్నాం. వీటి కారణంగా మన సైన్యం తక్షణమే వేగంగా స్పందించి పాక్ ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్లను కూల్చివేసింది. ఈ రక్షణ వ్యవస్థలో ఏఏ విభాగాలున్నాయో చూద్దాం. ఎయిర్ డిఫెన్స్ గన్స్ సహాయంతో మన సైన్యం 50 డ్రోన్లవరకు కూల్చివేసింది. మరో 20 డ్రోన్లను వాటి రేడియో ఫ్రీక్వెన్సీలను జామ్ చేయడం ద్వారా వాటిని కూల్చింది. దేశీయంగా తయారు చేసిన భూమి ఉపరితలం నుంచి ఆకాశంలోకి ప్రయోగించగల ఆకాశ్ క్షిపణులు పశ్చిమ సరిహద్దులో వాస్తవాధీన రేఖ వెంట, పాక్ నుంచి వస్తున్న దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాయి. ఇక పాకిస్తాన్ నుంచి వచ్చే వైమానిక దాడులను రష్యా తయారీ ఎస్`400(సుదర్శనచక్ర), బరాక్`8 క్షిపణుల సహాయంతో అడ్డుకుంది. ఇంటిగ్రేటెడ్ కౌంటర్`యుఏఎస్ గ్రిడ్ను మన సైన్యం క్రియాశీలకం చేసింది. ఇది మన లక్ష్యాలవైపు దూసుకొస్తున్న క్షిపణులు, డ్రోన్లు, విమానాలను గు ర్తించి వాటిని కూల్చివేయడంలో సమన్వయ సహకారం అందించింది.
కూల్చివేసిన డ్రోన్ల శిథిలాలు అమృత్సర్ ప్రాంతంలో మన సైన్యం సేకరించింది. వీటిని పూర్తిగా పరీక్షించిన తర్వాత, దాడుల్లో పాకిస్తాన్ ప్రమేయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టడం తర్వాతి కార్యక్రమం. నియంత్రణ రేఖవెంట డ్రోన్లతో పాటు పెద్ద ఎత్తున ఫిరంగి దాడులు చేస్తున్న పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది. ఫలితంగా పౌరుల మర ణాలు సంభవిస్తున్నాయి. వీటికి ప్రతిగా భారత్ జరిపిన దాడుల్లో పాకిస్తాన్కు చెందిన కనీసం ఒక్క డిఫెన్స్ రాడార్ ధ్వంసమైనట్టు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మనదేశం పాకిస్తాన్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి ధ్వంసంచేసినందుకు, ఆగ్రహంతో రగిన పాక్ ఏకంగా మన సైన్యం, పౌర నివాసాలపై దాడులకు తెగబడిరది. మన సైన్యం కేవలం ఉగ్ర స్థావరాలనే ధ్వంసం చేసింది తప్ప పైనిక స్థావరాలు, పౌర ఆవాసాల జోలికి పోలేదు. ఇటువంటి నీతి నిజాయతీలు పాకిస్తాన్కు ఏకోశానా వుండవు కనుక ఇష్టం వచ్చిన రీతిలో సరిహద్దు వెంట దాడులు జరిపింది. ఏతావాతా చెప్పాలంటే, ఉగ్రస్థావరాలపై దాడులు, ప్రస్తుతం పాక్ ప్రయోగిస్తున్న డ్రోన్లు, ఇతర క్షిపణులు, వైమానిక దాడులను సాంకేతిక పరిజ్ఞానంతో తుత్తినియలు చేస్తున్న భారత్ సామర్థ్యాన్ని ప్రపంచం బిత్తరపోయి చూస్తున్నది. ఈ యుద్ధం కలిగించే నష్టం మాట అట్లా వుంచితే రక్షణ రంగం విషయంలో భారత్తో ప్రపంచ దేశాలు వ్యవహరించే శైలిలో గతం కంటే పూర్తి భిన్నవైఖరి కనిపించక మానదు. ఇప్పటికే ప్రపంచంలోని అన్ని ప్రధాన రాజకీయ గ్రూపుల్లో మనదేశం సభ్యురాలు (బ్రిక్స్, క్వాడ్, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మొదలైనవి). ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నింటితో సంబంధాలు కొనసాగిస్తూ, తన ప్రత్యేకతను నిలుపుకుంటూ వస్తున్న భారత్, తాజా పాక్ యుద్ధంతో తన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రపంచంలో ఒకదానికొకటి బద్ధశత్రువులుగా వ్యవహరించే అన్ని దేశాలతో మనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఎవరికి ఏ కష్టం వచ్చినా మొదటగా స్పందించేది భారత్ మాత్రమేనన్న అంశం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు స్పష్టంగా తెలిసింది. మనకు కేవలం రెండు దేశాలు మాత్రమే శత్రువులు. ఒకటి చైనా రెండు పాకిస్తాన్. తాజాగా బంగ్లాదేశ్ కూడా ఈ జాబితాలో చేరింది. కానీ ఒక్కటి మాత్రం నిజం. మనతో పెట్టుకున్న ఏ దేశం ఇప్పటివరకు బాగుపడిన దాఖలాలు లేవు! తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయాయి! ఇది వర్తమాన చరిత్ర చెబుతున్న సత్యం. ఇది ధూర్త పాకిస్తాన్కు, మనదేశంలో పాకిస్తాన్ భక్తులకు అర్థం కాదు.