raithulu samagra serveyku sahakarinchali, రైతులు సమగ్ర సర్వేకు సహకరించాలి.

రైతులు సమగ్ర సర్వేకు సహకరించాలి.

ప్రభుత్వం చేపట్టిన రైతు సమగ్ర సర్వేలో ప్రతి రైతులు తప్పక సహకరించాలని మండల వ్యవసాయ శాఖ అధికారి దయాకర్‌ అన్నారు. మంగళవారం దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి, అడవి రంగాపురం, రేబల్లె, నాచినపల్లి గ్రామాలలో రైతు సమగ్ర సమాచార సర్వేను వ్యవసాయ శాఖ అధికారి దయాకర్‌ ప్రారంభించారు. పంటలు, భూముల రకాలు, పాడి పశువుల వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా దయాకర్‌ మాట్లాడుతూ రైతు సమగ్ర సేకరణ సర్వేలో ప్రతి ఒక్కరూ తమ పట్టా పాసు పుస్తకాలు, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాసు పుస్తకం జిరాక్సులను అందించి సమగ్ర సర్వేలో నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ విస్తీర్ణ అధికారులు మాలోతు హనుమంతునాయక్‌, రాజేష్‌, విశ్వశాంతి, మదుతోపాటు గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *