మర్రిపల్లిగూడెం లో బెల్ట్ షాప్ లపై పోలీస్ ల దాడి…

నలుగురి అరెస్ట్….మద్యం స్వాదీనం

నేటిధాత్రి కమలాపూర్(హన్మకొండ)మండలంలోని మర్రిపల్లిగూడెం గ్రామములో అక్రమంగా మద్యం అమ్ముతున్న నలుగురిని అరెస్ట్ చేసి రూ.37,460 ల విలువ గలిగిన మద్యం స్వాధీన పరుచుకున్నట్లు సీఐ హరికృష్ణ తెలిపారు.వివరాల్లోకి వెళితే గ్రామములో నలుగురు వ్యక్తులు ఇండ్లలో మద్యం నిల్వలు వున్నట్లు వచ్చిన సమాచారం తో శుక్రవారం తనతో పాటుపోలీస్ సిబ్బంది తనికీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ తనిఖీల్లో గట్టు అనిల్ ఇంట్లో రూ.9,150 ల విలువగల మద్యం,ముంజ యుగంధర్ ఇంట్లో రూ.8,830 విలువ గల మద్యం, పొరండ్ల కుమార స్వామి ఇంట్లో రూ.5,490 లో విలువ గల మద్యం, పోరండ్ల రఘుపతి ఇంట్లో రూ.13, 990ల విలువగల మద్యం నలుగురి వద్ద వద్ద కలిపి రూ.37,460 ల విలువ గల మద్యం లభించగా వాటిని స్వాధీన పరచుకుని,నలుగురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *