మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి..
మహబూబ్ నగర్ జిల్లా
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా…
దేవరకద్ర నియోజకవర్గం భుత్పూర్ మండలం తాటిపర్తి గ్రామంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి కి మద్దతుగా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమనికి ముఖ్య అధితిగా బి ఆర్ ఎస్ పార్టీ ఎం పి, అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వారు మాట్లడుతు, పాలమూరు పార్లమెంట్ నియోజకవర్గం లో ఏక్కడి కి వెళ్లిన ప్రజలు బి ఆర్ ఎస్ వైపే మొగుచుపుతున్నారని, ప్రజల ఆదరణ చూడలేక.. సీఎం రేవంత్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారని, మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నారని మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ తమ ఓటుతో సీఎం రేవంత్ రెడ్డికి తగు గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.
కార్యక్రమంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డికి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు..
కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు,రైతులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మన్నే శ్రీనివాస్ రెడ్డి కి మద్దతు పలికారు..
నారాయణపేట నియోజకవర్గం దామరగిద్ద మండల కేంద్రంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డికి మద్దతుగా నారాయణపేట మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు….
కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నే శ్రీనివాస్ రెడ్డి ,మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ ,మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థికి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు..
కార్యక్రమానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు,రైతులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని మన్నే శ్రీనివాస్ రెడ్డి కి మద్దతు పలికారు.