ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని ప్రారంభించిన

జిల్లా ఎస్పీ శ్రీమతి డి జానకి ఐపీఎస్.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మహబూబ్‌నగర్‌ జిల్లా పోలీస్ ప్రధాన కవాతు మైదానంలో ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ శ్రీమతి డి. జానకి ఐపీఎస్‌. ప్రారంభించరు..
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…. పోలీసు శాఖ నిర్వహణ, సిబ్బంది విధులు, ఉపయోగించే ఆయుధాలు, వాహనాలు, ఇతర సాంకేతిక పరికరాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి సేవలను ప్రజలకు గుర్తు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోలీసు శాఖపై తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.


ఇలాంటి ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాలు ప్రజలు, ముఖ్యంగా యువతలో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు, పోలీసు శాఖపై అవగాహనను పెంచేందుకు దోహదపడతాయని ఎస్పీ డి. జానకి ఐపీఎస్‌ తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 21న జరుపుకుంటారని ఎస్పీ అన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!