త్వరలో సింగరేణి కార్మికులకు మెడికల్ బోర్డు నిర్వహణ
అన్ ఫిట్ కార్మికులకు ఉద్యోగ నియామక పత్రాలు
ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్
భూపాలపల్లి నేటిధాత్రి
https://youtu.be/pIjzIT_qRMI
సింగరేణి కార్మికుల అన్ని సమస్యల పరిష్కారానికి సింగరేణి యాజమాన్యం హామీ ఇచ్చిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ తెలిపారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమరయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నో ఏళ్లుగా పలు సమస్యలు సింగరేణిలో పెండింగ్లో ఉన్నాయన్నాయని,వాటి పరిష్కారానికి యాజమాన్యం ఇటీవల హామీ ఇచ్చినట్లు తెలిపారు.త్వరలో మెడికల్ బోర్డు ఏర్పాటవుతుందన్నారు. అండర్ గ్రౌండ్ అలవెన్సులను కట్ చేయవద్దని తాము చెప్పామన్నారు. ఆస్పత్రి బిల్లులకు అదనంగా వేతనం నుంచి కోత విధించరాదని పూర్తిగా మీనాయించాలని యాజమాన్యాన్ని కోరినట్లు చెప్పారు.పెండింగ్లో ఉన్న 337 మందికి పైగా డిపెండెంట్లకు ఉద్యోగాలు నియామక పత్రాలు అందజేయనున్నట్లు చెప్పారు. వెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దు, సిబిఎస్ విద్యా విధానం,
డిస్మిస్ కార్మికుల సమస్యను పరిష్కరిస్తారన్నారు. మారుపేరు సమస్యల పరిష్కారానికి యాజమాన్యం అంగీకరించిందన్నారు. ఆస్పత్రుల్లో ఆధార్ వివరాలు మారిన వారికి సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా చికిత్స అందిస్తారని పేర్కొన్నారు. ఓవర్మెన్లకు పెండింగ్ ప్రమోషన్లు మంజూరు చేస్తున్నట్లు యాజమాన్యం అంగీకరించిందన్నారు. కార్మికుల సొంత ఇంటి కల, అన్ఫిట్ అయిన మైనింగ్, ట్రేడ్స్ మెన్ లకు సూటబుల్ జాబ్ ఇస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. ఇతర కార్మిక సంఘాలు ఏఐటీయూసీ గుర్తింపు సంఘం గా ఉన్న ఏ ఒక్క హామీ అమలు చేయడం లేదని ఆరోపించడం సరైంది కాదని సమస్యల పరిష్కారం కోసం నిరంతరం బస్సు జాత నిర్వహించి ప్రతిపక్ష సంఘాల కంటే మేమే ప్రభుత్వంపై పోరాడమని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో కార్మిక సమస్యల పరిష్కారానికై అన్ని సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ సమావేశంలో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మోటపలుకుల రమేష్, వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శిలు జి శ్రీనివాస్, ఆసిఫ్ పాషా, తాళ్ల పోషం తదితరులు పాల్గొన్నారు.
