కిష్టాపూర్ గ్రామంలో బడిబాట చేపట్టిన మండల అధికారులు.

School School

కిష్టాపూర్ గ్రామంలో బడిబాట చేపట్టిన మండల అధికారులు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

 

 

కిష్టాపూర్ గ్రామపంచాయతీలో శుక్రవారం బడిబాట చేపట్టిన అధికారులు.స్కూలు వెళ్లే పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా తల్లిదండ్రులకు ప్రభుత్వం కల్పి పిస్తున్న సౌకర్యాలను అవకాశాలను తెలియజేస్తూ నాణ్యమైన విద్య పిల్లలకి అందించాలని తల్లిదండ్రులు ఆర్థిక భారానికి లోను కాకూడదని ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.అలాగే గ్రామపంచాయతీలోని తాగునీటి సమస్యల పరిష్కారానికి గ్రామంలో తిరిగి సమస్యలను గుర్తించి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని గ్రామపంచాయతీ కార్యదర్శికి ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ గౌడ్,ఎంపీఓ,శ్రీపతి బాపురావు, ఇరిగేషన్ డిఈ విద్యాసాగర్ రావు,పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్,కిష్టాపూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణారెడ్డి,ఉపాధ్యాయులు కవిత,రజిత,అంగన్వాడీ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది,గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!