మేడే స్పూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాడుదాం.

Labor Rights Labor Rights

మేడే స్పూర్తితో కార్మిక హక్కుల కోసం పోరాడుదాం

మే 20న సార్వత్రిక సమ్మె లో కార్మికులందరూ భాగస్వాములు కావాలి

సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి )

 

 

సిరిసిల్లా పట్టణ కేంద్రంలోని ఈరోజు జరిగిన మేడే బహిరంగ సభలో సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ తమ హక్కుల సాధన కోసం తుపాకీ గుళ్ళకు ఎదురేగిన కార్మికులు, ఉరికంబాలెక్కిన నాడు సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తున్న బిజెపి మతోన్మాద కార్పొరేట్ విధానాలను కార్మిక వర్గం ఐక్యంగా ప్రతిఘటించాలని సి.ఐ.టి.యు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ పిలుపునిచ్చారు.

గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సి.ఐ.టి.యు రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రపంచ కార్మిక దినోత్సవం 139 వ. మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలో లేబర్ అడ్డా వద్ద , రైతు బజార్ వద్ద , మున్సిపల్ ఆఫీస్ వద్ద , సివిల్ హాస్పిటల్ వద్ద , నెహ్రు నగర్ , చంద్రంపేట , గణేష్ నగర్ , బి.వై. నగర్ ఏరియాలలో సిఐటియు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు చేశారు బి.వై. నగర్ లో మేడే అమరవీరుల చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించి బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఇట్టి బహిరంగ సభకు సి.ఐ.టి.యు రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేష్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ మేడే అమరవీరులు సాధించిన హక్కులను నేటి కేంద్ర బిజెపి సర్కార్ హరించి వేస్తుందని ఆ హక్కుల రక్షణ కోసం మే 20న జరుగు సార్వత్రిక సమ్మె లో అన్ని రంగాల కార్మికులు , కష్టజీవులు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.కార్మికులు ఉదయం 10 గంటలకు పనికి వెళ్లి సాయంత్రం 6 గంటలకు ఇంటికి వస్తున్నారంటే కారణం నాడు మేడే కార్మికులు చిందించిన రక్తం నేనని చెప్పారు అందులో అధికారంలో ఉన్న బిజెపి కార్మికులు పోరాడి సాధించుకుంటున్న ఎనిమిది గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచుతూ కార్పొరేట్ దిగ్గజాలకు కార్మికుల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని విమర్శించారు 29 కార్మిక చట్టాలను నరేంద్ర మోడీ సర్కారు ఒక కలం పోటుతో రద్దుచేసి నాలుగు లేబర్ కోడులు తీసుకొచ్చిందని విమర్శించారు అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం పిఎఫ్,ఈఎస్ఐ వంటి కనీస హక్కులు కూడా లేవన్నారు దుర్బర దారిద్రం అనుభవిస్తున్నారని చెప్పారు.

మేడే కార్మిక దినోత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదని అది ఒక వర్గ పోరాట స్ఫూర్తి దినమని పేర్కొన్నారు.

కార్మిక వర్గం ఆర్థిక పోరాటాలకే పరిమితం కాకుండా సమాజంలోకి అన్ని రకాల అంతరాలను నుండి విముక్తి చేయటానికి కృషి జరపాలన్నారు రోజువారీగా పెరుగుతున్న ధరలు కార్మికులకు వస్తున్న చాలీచాలని జీతాలు తో కార్మిక వర్గం దుర్భర దారిద్రాన్ని అనుభవిస్తుందన్నారు బిజెపి పాలిత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ సర్కార్ 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచి పెంచిందన్నారు మే 20 న దేశవ్యాప్తంగా కార్మిక వర్గం చేస్తున్న సమ్మెతో మోడీ మెడలు వంచి కార్మిక వర్గ ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు.

ఇట్టి కార్యక్రమాలలో CITU జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి , కార్యదర్శి కోడం రమణ , మూషం రమేష్ , అన్నల్దాస్ గణేష్ , సూరం పద్మ , మిట్టపల్లి రాజమల్లు , రాపెల్లి రమేష్ , నక్క దేవదాస్ , సిరిమల్ల సత్యం , కుమ్మరికుంట కిషన్ , గుండు రమేష్ , కుడిక్యాల కనకయ్య , బెజుగం సురేష్ , ఎక్కల్దేవి జగదీశ్ , ఉడుత రవి , బాస శ్రీధర్ , స్వర్గం శేఖర్ , సుల్తాన్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!