ఇల్లందులో బీఆర్ఎస్ సభ నిర్వహణకు పలు స్థలాలను పరిశీలించిన ఎంపీ రవిచంద్ర
ఎంపీ రవిచంద్ర వెంట ఎమ్మెల్యే హరిప్రియ, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రాజేందర్, మునిసిపల్ ఛైర్మన్ వెంకటేశ్వరరావు, బీఆర్ఎస్ ప్రముఖులు వీరభద్రం, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, నాగేశ్వరరావు, రంగనాథ్
సింగరేణి గ్రౌండ్స్ లో క్రికెట్ ఆడి, క్రికెటర్లకు 10వేలు అందజేసిన ఎంపీ రవిచంద్ర
బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చే నెల 1వ తేదీన ఇల్లందులో జరిగే “ప్రజా ఆశీర్వాద సభ”లో ప్రసంగిస్తారు.ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర స్థానిక ఎమ్మెల్యే బానోతు హరిప్రియ హరిసింగ్ నాయక్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ దిండిగల రాజేందర్, మునిసిపల్ ఛైర్మన్ ధమ్మాలపాటి వెంకటేశ్వరరావులతో కలిసి సోమవారం సాయంత్రం ఇల్లందులో పర్యటించారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర వారితో కలిసి ఇల్లందు పట్టణం లలితాపురం చిల్లా ముబారక్ సమీపాన ఖాళీ ప్రదేశాన్ని,జే.కే.కాలనీలోని సింగరేణి గ్రౌండ్స్,రన్స్ అండ్ గోల్స్ మైదానాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు సింగరేణి గ్రౌండ్స్ లో స్థానిక క్రీడాకారులతో క్రికెట్ ఆడి వారికి ప్రోత్సాహకరంగా 10వేలు అందజేశారు.ఈ పర్యటనలో ఎంపీ రవిచంద్ర వెంట బీఆర్ఎస్ నాయకులు శీలంశెట్టి వీరభద్రం,శీలం రమేష్, నాదెళ్ల శ్రీనివాస్ రెడ్డి,కొక్కు నాగేశ్వరరావు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు రంగనాథ్, వద్దిరాజు రవిచంద్ర అనుచరులు వెంపటి ఉపేందర్,భానుప్రతాప్,గుమ్మడెల్లి హరీష్ తదితరులు ఉన్నారు.