ishtamaina courselanu empika chesukuni sthirapadali, ఇష్టమైన కోర్సులను ఎంపిక చేసుకుని స్థిరపడాలి

ఇష్టమైన కోర్సులను ఎంపిక చేసుకుని స్థిరపడాలి

విద్యార్థినులు తనకు ఇష్టమైన కోర్సులను ఎంపిక చేసుకుని భవిష్యత్తులో స్థిరపడాలని కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాల ప్రత్యేక అధికారిణి మంజుల అన్నారు. శుక్రవారం దుగ్గొండి మండలంలోని మల్లంపల్లి గ్రామ కస్తూర్బాగాంధీ బాలికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిపి విద్యార్థుల భవిష్యత్తు కార్యాచరణపై అవగాహన, శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిణి మంజుల మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాలపై ఎలాంటి ఆవేశపూరితమైన నిర?యాలు తీసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. పదవ తరగతి తర్వాత ఉండే అన్ని కోర్సులపై అవగాహన కల్పిస్తూ ఇష్టమైన కోర్సును ఎంచుకుని తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచిపేరు తెచ్చుకునే విధంగా ముందుకుసాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక బందం రమ, సుభాషిని, మంజుల, సరస్వతి, రాధలతోపాటు విద్యార్థినిలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *