Former Sarpanches Demand Pending Bills
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలి
నడికూడ,నేటిధాత్రి:
మాజీ సర్పంచ్ ల మండల ఫోరం అధ్యక్షుడు తిప్పర్తి సాంబశివ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీవో ఆర్.రామకృష్ణ కి వినతి పత్రం అంద జేశారు.2019 నుండి 2024 కాలంలో గ్రామాలు అభివృద్ధే ధ్యేయంగా సిసి రోడ్లు,సైడ్ డ్రైనేజీ లు,పల్లె ప్రకృతి వనాలు,పైపులైన్ లు, లైటింగ్, గ్రామంలో నూతన ట్రాక్టర్,టాంకర్,డంపింగ్ యార్డ్,గ్రామ పంచాయతీ నూతన భవనాలు,రైతు వేదికలు, గ్రామాల్లో అభివృద్ధిలో భాగంగా అప్పులు తెచ్చి పనులు చేయడం జరిగింది. 2023 – 2024 మధ్య కాలంలో మిగిలిపోయిన పెండింగ్ బిల్లులు రాక సర్పంచులు ఆత్మ హత్య చేసుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి దయచేసి గ్రామ పంచా యతీ 15 వ ఫైనాన్స్ నుండి డబ్బులు వెంటనే రిలీజ్ చేయాలని కోరడం జరిగింది.మాజీ సర్పంచులు నడికూడ ఊర రవీందర్ రావు,ముస్త్యాలపల్లి మాజీ సర్పంచ్ బోట్ల సంధ్య రవీందర్,పులిగిల్ల మాజీ సర్పంచ్ సదానందం,కౌకొండ మాజీ సర్పంచ్ రమేష్, సర్వాపురం మాజీ సర్పంచ్ రవీందర్, లు ఉన్నారు.
