Indiramma Housing Housewarming Held in Tangallapally
ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహప్రవేశం…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్ల నూతన గృహప్రవేశం జరిగింది. ఇట్టి గృహప్రవేశానికి తంగళ్ళపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజ్యం రిబ్బన్ కట్ చేసి నూతన గృహప్రవేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అభివృద్ధి పథంలో ముందు ఉంచే దిశగా అనేక సంక్షేమ పథకాలు స్థాపించి అందులో భాగంగా ఇందిరమ్మ గృహ పథకం తీసుకువచ్చి రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టుకునే విధంగా వాళ్ళ చిరకాల కోరిక నెరవేర్చే విధంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం తీసుకొచ్చి వారికి ఇండ్ల నిర్మాణం కొరకు నిధులు మంజూరు చేస్తూ వారు సొంత ఇల్లు కట్టుకోవడానికి అనేక సదుపాయాలు కల్పిస్తూ. గృహ నిర్మాణాలు చేపట్టే విధంగా ప్రోత్సహిస్తూ. రాష్ట్రంలో ఇండ్లు లేని నిరుపేదలు ఉండకూడదని ప్రభుత్వ ఏకైక లక్ష్యం అని. ఎందుకు రాష్ట్రంలోని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా. ఇట్టి పథకాన్ని సద్వినియోగం చేసుకొని. అందరూ నిరుపేదలైన అర్హులైన లబ్ధిదారులు ఇంట్లో నిర్మించుకోవాలని ఇట్టి మహత్తర అవకాశాన్ని. వినియోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. తంగళ్ళపల్లి సర్పంచ్ మోర లక్ష్మీరాజం. వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింహ గౌడ్ తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్. ఇందిరమ్మ కమిటీ సభ్యులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు లింగాల భూపతి. తంగళ్ళపల్లి మాజీ ఉపసర్పంచ్ పెద్దూరి తిరుపతి. ఎగుర్ల ప్రశాంత్ పొన్నాల పరశురాం.మీరాల శ్రీనివాస్. శ్రీకాంత్ గౌడ్. వార్డు మెంబర్ .హనుమాన్లు. బండి పరిసరాలు. కొత్త రవి గృహ లబ్ధిదారులు వారికుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
