కార్యకర్తలే పార్టీకి బలం
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోభూపాలపల్లి మాజీ శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి,వరంగల్ రూరల్ జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ & బీఆర్ఎస్ పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి ఆదేశానుసారం క్షేత్రస్థాయిలో బిఆర్ఎస్ పార్టీ బలోపేతానికి మెతుకు తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించడం జరిగింది.కొద్ది రోజుల్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలం లోని అన్ని గ్రామాల్లో పూర్తిస్థా యిలో అన్ని స్థానాలను బీఆర్ ఎస్ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త ఐక్యమత్యంతో కలిసికట్టుగా పనిచేసి మండలంలో బిఆర్ ఎస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.వసంతపూర్ గంగిరేణిగూడెం సూర్య నాయక్ తండా గ్రామాల్లో పర్యటించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ లక్ష్మారెడ్డి రైతుబంధు కోఆర్డినేటర్ ఆదిరెడ్డి మాజీ మండల పార్టీ అధ్యక్షులు ఘంటా శ్యామసుందర్ రెడ్డి మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మారేపల్లి నందం మాజీ ఎంపిటిసిల ఫోరం మండల అధ్యక్షులు మేకల శ్రీను మాజీ ఎంపీటీసీ విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ సర్పంచ్ అరికిల్ల ప్రసాద్, గజ్జల రాజు బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు కొమ్ముల శివ మండల ముఖ్య నాయకులు మారేపల్లి మోహన్ మేకల వెంకన్న కరుణ్ బాబు, మారపల్లి ప్రభాకర్ శంకర్ మరియు వసంతపూర్ గ్రామ సీనియర్ నాయకులు ఇటుకల పాపారావు గ్రామ శాఖ అధ్యక్షులు రవీందర్ రెడ్డి రమేష్ బెజ్జంకి లింగమూర్తి కోటి లింగాచారి నాలికరాజు వైనాల బిక్షపతి మొండయ్య సూర్య నాయక్ తండా గ్రామ శాఖ అధ్యక్షులు లావుడియా రవీందర్ మాలోతు భాస్కర్ బుఖ్య భాస్కర్ తిరుపతి అమిత్ ధన్ సింగ్ కృష్ణ రాజు బాలు నాయక్ సుధాకర్ పాల్గొన్నారు.