వందల చెట్లు నరికిన కరెంటు కాంట్రాక్టర్.

Electricity Pole. Electricity Pole.

వందల చెట్లు నరికిన కరెంటు కాంట్రాక్టర్
ప్రకృతి పెంచమంటుంది కరెంటు స్తంభం తుంచుమంటుంది
చోద్యం చూస్తున్న అధికారులు
ఎలాంటి అనుమతులు లేకుండా చెట్లను నరుకుతున్న కాంట్రాక్టర్

జమ్మికుంట :నేటిధాత్రి

 

జమ్మికుంట మండల పరిధిలోగల కోరపల్లి గ్రామంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణం జరిగింది ఇట్టి సబ్స్టేషన్ ప్రారంభించడానికి సన్నద్ధమై ఉంది ఈ సబ్ స్టేషన్ కు కరెంటు సప్లై కోసం జమ్మికుంట నుండి ప్రత్యేకంగా పోల్స్ ద్వారా కరెంటు తీసుకురావడం జరిగింది తీసుకువచ్చే క్రమంలో దాదాపు రెండున్నర కిలోమీటర్లు సైదాబాద్ శివారు కోరపల్లి శివారు ఆర్ అండ్ బి రోడ్డు ప్రక్కన పెట్టినటువంటి పెద్ద పెద్ద చెట్లను అనుమతి లేకుండా ఏ అధికారి పర్యవేక్షణ లేకుండా ఇష్టానుసారంగా చెట్లను నరకడం జరిగింది . దాదాపు పది సంవత్సరాల క్రితం పెట్టినటువంటి చెట్లు ఎన్జీఎన్ఆర్ఇజేఎస్ పథకం కింద ప్రభుత్వం వ్యయం చేసి చెట్లను పెంచడం జరిగింది . వాస్తవానికి అటవీ శాఖ మరియు రెవెన్యూ శాఖ అనుమతులు తీసుకుని టెండర్ ద్వారా ఈ చెట్లను తొలగించాలి కానీ వాళ్లు చెట్టు ఉన్నది తెలిసి కూడా చెట్టు పైన లైన్ వచ్చే విధంగా ఫోల్స్ పాతడం అది కావాలని తప్పు చేయడమే ఎందుకంటే రోడ్డు పక్కన చాలా స్థలంఉంది చెట్లను వదిలిపెట్టి కూడా పోల్స్ వేయచ్చు గతంలో కూడా నిర్మాణ సమయంలో ఇట్టి నిర్మాణం చెరువులో చేస్తున్నారని కోరపల్లి గ్రామస్తులు కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్టి నిర్మాణం మొట్టమొదటి నుండి వివాదాస్పదంగానే జరుగుతుంది ఇప్పటికైనా అధికారులు స్పందించి తప్పును గుర్తించి చర్యలు తీసుకోవాలని రహదారి వెంటే పోయేటువంటి ప్రయాణికులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!