చెరుకు రసం ఎక్కువగా తాగొద్దు.. అధిక చక్కెర స్థాయిలతో అనారోగ్య సమస్యలు: ఐసీఎంఆర్!
వేసవిలో ఎండ వేడిమిని తట్టుకోలేక ఉపశమనం కో సం చాలా మంది చెరకు రసం, పండ్ల జ్యూస్లు, సాఫ్ట్ డ్రింక్లు తాగుతుంటారు. అయితే చక్కెర స్థాయి అధికంగా ఉండే డ్రింక్లకు వ్యతిరేకంగా భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తాజాగా మార్గదర్శకాల్లో పలు సూచనలు చేసింది.
◆ పండ్ల జ్యూస్లు, సాఫ్ట్డ్రింకులు మానుకోండి
◆ నీరు, మజ్జిగ, పండ్లు వంటివి తీసుకోవాలి
◆ భారత వైద్య పరిశోధనా మండలి సూచనలు
జహీరాబాద్. నేటి ధాత్రి:
వేసవిలో ఎండ వేడిమిని తట్టుకోలేక ఉపశమనం కో సం చాలా మంది చెరకు రసం, పండ్ల జ్యూస్లు, సాఫ్ట్ డ్రింక్లు తాగుతుంటారు. అయితే చక్కెర స్థాయి అధికంగా ఉండే డ్రింక్లకు వ్యతిరేకంగా భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) తాజాగా మార్గదర్శకాల్లో పలు సూచనలు చేసింది. చెరకు రసంలో చక్కెర ఎక్కువగా ఉంటుందని, దాన్ని తాగడాన్ని తగ్గించుకోవాలని పేర్కొన్నది. నీరు లేదా తాజా పండ్లకు సాఫ్ట్ డ్రింక్లు ప్రత్యామ్నాయం కాదని, వాటిని తీసుకోవడం మానేయాలని పేర్కొన్నది. వాటికి బదులుగా మజ్జిగ, నిమ్మ రసం నీరు, కొబ్బరి నీళ్లు, చక్కెర లేకుండా పండ్ల జ్యూస్లు తాగాలని సూచించింది.
డీహైడ్రేషన్, డయాబెటిస్ రిస్క్
అధికంగా చెరకు రసం తాగడం వల్ల పలు అనారోగ్య ముప్పులు ఉంటాయని డీహెచ్ఈఈ డైటీషియన్ డాక్టర్ శుభా రమేశ్ పేర్కొన్నారు. అధికంగా చక్కెర తీసుకోవడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుందని, చెమట రూపంలో శరీరం నుంచి నీరు అధికంగా బయటకు వెళ్లే వేసవిలో ఇది ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరుగుతాయని, తద్వారా ఇన్సులిన్ నిరోధకత, టైప్-2 డయాబెటిస్ ముప్పు ఏర్పడుతుంది. అదేవిధంగా అధిక కెలోరీల వల్ల బరువు పెరిగే అవకాశం ఉన్నదని, ఇది డయాబెటిస్, హృదయ సంబంధిత వ్యాధులకు దారితీసే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.
‘100% ఫ్రూట్ జ్యూస్’ అని చెప్పుకోవద్దు
ఆహార ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపార ప్రకటనలు, లేబుల్స్పై నుంచి ‘100 శాతం ఫ్రూట్ జ్యూస్’ అనే పదాలను తక్షణమే తొలగించాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. నీరు కలిపిన పండ్ల రసాలను నూటికి నూరు శాతం పండ్ల రసాలుగా చెప్పుకుంటూ ప్రకటనలు జారీ చేస్తున్నట్లు, లేబుల్స్పై రాస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. అమ్ముతున్న జ్యూస్లో అత్యధిక భాగం నీరైనపుడు, అది 100% ఫ్రూట్ జ్యూస్ అని చెప్పడం తప్పుదోవ పట్టించడమేనని తెలిపింది.