గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలోని కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో నిర్వహించే కార్తీక దీపోత్సవానికి, గోశాల గోమాతలకు దానా బస్తాలను నూనె క్యాన్లను గణపురం మండల కేంద్రానికి చెందిన మచ్చిక కోమల, శంకర్ గౌడ్, ల కుమారుడు కావ్య శ్రీ,, కిరణ్ కుమార్ గౌడ్ దంపతులు శుక్రవారం ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ముసునూరు నరేష్ వారికి ఆశీర్వచనాలు తీర్థప్రసాదాలను అందజేశారు కార్తీక దీపోత్సవానికి నూనెను గోశాల గోమాతలకు దాన బస్తాలను అందజేసిన కావ్య శ్రీ కిరణ్ దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.