డెంగ్యూ, మలేరియాను నియంత్రించాలి:
ఎంటమాలజి :ఏ ఈ వనజ
మల్కాజిగిరి నేటిధాత్రి
మలేరియా దినోత్సవం సందర్భంగా మల్కాజ్ గిరి సర్కిల్ ఎంటమాలజీ విభాగం సర్కిల్ ఏఈ వనజ ఆధ్వర్యంలో సఫిల్ గూడ నుంచి ఆనంద్ బాగ్ చౌరస్తా వరకుర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ..

దోమల నియంత్రణ ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని డెంగ్యూ, మలేరియాను నియంత్రించాలని సూచించారు. అనంతరం ప్రజలకు డెంగ్యూ, మలేరియా వ్యాధుల పట్ల అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు గురు భూషణ్, నాగేందర్ , షోకత్ , రామచందర్, ఎండి అబ్దుల్ , సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.