రాజ్యాంగాన్ని వ్యతిరేకించే పార్టీలను ఓడించండి: సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :
భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించి, నిర్వీర్యం చేసే పార్టీలనుఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. చండూరు మండల పరిధిలోనిబోడంగి పర్తి గ్రామంలోభువనగిరి పార్లమెంటు అభ్యర్థిఎండి.జహంగీర్ గెలుపు కోసంఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంజీఎస్టీ పేరా ప్రజలపై అధిక పన్నులుమోపిందని, ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచిందని ఆయన అన్నారు. పెట్టుబడిదారులకు దేశ సంపద దోచి పెట్టినమోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. దేశంలోని సమతుల్యత లేని అభివృద్ధినిమోడీ చేస్తున్నారని,దక్షిణ భారతదేశంలోనిధులు కేటాయింపులు,నీటి కేటాయింపులు,ప్రాజెక్టుల నిర్మాణం,రైలు మార్గాల నిర్మాణం లేదని తెలిపారు. మోడీ ప్రభుత్వంరాజ్యాంగానికి విరుద్ధంగా పాలన కొనసాగిస్తున్నారని, ఈ పార్లమెంటు ఎన్నికలలోభువనగిరి సిపిఎం అభ్యర్థిఎండి.జహంగీర్ పేద ప్రజల పక్షాన నికరంగా పోరాడే నాయకుడనిఆయన అన్నారు.ఈ ఎన్నికలలోసిపిఎం అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలనిఆయన అన్నారు. నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించేఎండి.జహంగీర్ ను గెలిపించి, ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే తత్వాన్ని కాపాడుకోవాలనిఆయన అన్నారు.ఈ కార్యక్రమంలోసిపిఎం చండూరు మండల సహాయ కార్యదర్శిజెర్రిపోతుల ధనంజయ గౌడ్,బోడంగి పర్తి గ్రామ శాఖ కార్యదర్శిగౌసియా బేగం,కొత్తపల్లి నరసింహ, రాములమ్మ, యాదమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *