భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి పట్టణంలో నూతన ఎస్సైగా విధుల్లోకి చేరిన మచ్చ సాంబమూర్తి ని మర్యాద పూర్వకంగా సిపిఐ పట్టణ నాయకులు కలిశారు. ఈ సందర్బంగా సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు. ప్రవీణ్ కుమార్ శాలువా కప్పి పులా బొకే ను అందజేశారు. అనంతరం ట్రాఫిక్, ఫ్లెక్సీ ల సమస్యలను ఎస్సై సాంబమూర్తి దృష్టికి తీసుకుపోయారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు క్యాతరాజు సతీష్, నేరెళ్ల జోసెఫ్, వేముల శ్రీకాంత్, గడ్డం సింహాద్రి, గోనేల తిరుపతి, కునూరి భగత్, ఐలి శరత్ తదితరులు పాల్గొన్నారు.