జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం నర్వ గ్రామంలోని 7 వార్డు లో గల బోరు మోటర్ చెడిపోయి నీటి కొరతతో ప్రజలు 15 రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు కాంగ్రెస్ యువ నేత గోదారి విజయ్ దృష్టికి తీసుకెళ్లడంతో మంచి మనస్సు తో వెంటనే స్పందించి గురువారం రోజున తన సొంత ఖర్చుతో బోర్ కు సంబంధించిన మోటర్ కొనుగోలు చేసి తను దగ్గరుండి మోటర్ బిగించి ఇవ్వడం జరిగింది. ఇతర ఇంకా ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే ముందుండి సమస్యను పరిష్కరిస్తానని గ్రామస్తులకు మాటిచ్చారు. విజయ్ చేసిన సహాయానికి గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.