ఘనంగా జాతిపిత మహా త్మాగాంధీ వర్ధంతి
మహాత్మా గాంధీ సిద్ధాంతా లు, ఆశయాలు ఎప్పటికీ ఆదర్శం
కాంగ్రెస్ మండల పార్టీ అధ్య క్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి
శాయంపేట, నేటిధాత్రి:
జాతిపిత మహాత్మా గాంధీ సిద్ధాంతాలు ఆశయాలు ప్రతి ఒక్కరికి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తాయని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూది పాల బుచ్చిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలోని గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి బుచ్చిరెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి మాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లా డుతూ అహింసా విధానంతో కోట్ల మంది దేశప్రజలను ఒక్క తాటిపై నడిపి స్వాతంత్య్రం సాధించిన మహనీయుడని గుర్తు చేశారు. గాంధీజీ బోధన లైన సత్యం, అహింస, శాంతి, సేవ అనే సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలని, స్వదేశీ, మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం, పేదరిక నిర్మూలన వంటి గాంధీజీ ఆశయాలను నిజం చేసేందుకు చిత్తశుద్దితో పనిచేద్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్ర మంలో నాయకులు పోలేపల్లి శ్రీనివాస్ రెడ్డి, దుబాసి కృష్ణ మూర్తి, నిమ్మల రమేష్, మస్కే కుమా రస్వామి, మారపెల్లి వర ద రాజు, డీటీరెడ్డి, మార్కండే య, రఫీ, దామరకొండ కొము రయ్య, సుదర్శన్, కుమార స్వామి పాల్గొన్నారు.
